Pages

Monday, January 24, 2011

కొంచెం గౌరవం ?

*** శ్రీ  రామ  ***


****************
మా ఊళ్ళో  ఎకరం పొలం ఖరీదు పది లక్షలు.

దానిమీద బ్యాంక్ వడ్డీ  చూసుకుంటే కనిష్టంగా ఏడాదికి డబ్బై వేలు  నుండి ఎనైబై వేలు మధ్యలో వస్తుంది. తుఫాన్ లొచ్చినా, భూకంపాలు వచ్చినా మనకి ఢొకా లేని ఆదాయం...ఇంట్లో కూర్చుని ఏం చెయ్యకుండా వచ్చే ఆదాయం కదా...

అదే పొలం సాగుచేస్తే.... కష్టం అంతా పోను రైతుకి ఎకరాకి సంవత్సరానికి మిగిలేది ఇరవై ఐదు నుండి ముప్పై వేలు. ఇది కూడా ఆ పంట వరదలు, తుఫాన్లు, పురుగు, చీడ, వర్షాభావం, గిట్టుబాటు ధర ఇవన్నీ దాటుకుని వస్తే మిగిలేది.

ఇక రైతు ఉద్యోగం లో ఎన్ని రిస్కులు ....

ముసురు పడితే పకోడీలు  తిందామా , బిరియాని చేసుకుందామా అని మిగతా ప్రపంచం అంతా ఆలోచిస్తున్న  టైం లో పంట ఏమైపోతుందా  అన్న టెన్షన్...  
ఎప్పుడు ప్రభుత్వం  సెజ్ పేరుతో  పచ్చని పొలం లాక్కుని ప్రభుత్వ కనీస ధర చేతిలో  పెడుతుందా అన్న టెన్షన్...
"ఏరా  మీ చేలో  ఆ సూరిగాడి ఆవుపడి మేస్తుంటే నువ్వేంటి ఇక్కడ తాపీగా కూర్చున్నావ్ " అని పక్కింటి రైతు హెచ్చరిస్తే  పరిగెట్టే టెన్షన్...
"ఈ ఏడాదికి ఇక వర్షాలు లేనట్టేనట్రా...ఇక పొలానికి నీళ్ళు వదలరు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు" అంటుంటే అప్పటివరకూ చేసిన కష్టం  అంతా మట్టిపాలు అయిపోయినందుకు అటు ప్రకృతిని నిందించలేక  ఇటు తర్వాత పంటకి పెట్టుబడి ఎలా తేవాలా అనే టెన్షన్ ..

" అన్నీ సమకూరి పండించినా .... ఆఖర్లో సరి ఆయిన మద్దతు ధర లేక ..పంట పారబొసుకొవాల్సిన పరిస్తితి వచ్చే టెన్షన్"... 


పైన రెండు ఆప్షన్స్ ఇస్తే మనలాంటి తెలివయిన వాళ్ళు ఏం ఆలోచిస్తాం?...... హాయిగా పొలం అమ్మేసి దర్జాగ చీకు చింతా లేకుండా వడ్డీ తింటూ బ్రతక్క.... ఈ కష్టాలు  పడుతూ ...ఆ వచ్చీరాని ఆదాయం కోసం  ఎందుకు తాపత్రయం అని డిసైడ్ అయిపోతాం  కదా... ఇదే సలహా మన రైతన్నలకి ఇచ్చినప్పుడూ మనం వినే టిపికల్ సమాధానాలు   ఇలా ఉంటాయి  .....

  • నాకు ఈ పని తప్ప ఇంకేం  తెలవదు రా... మా నాన్న ఇదే నేర్పించాడు... తరతరాలుగా ఇదే  భూమితల్లిని నమ్ముకున్నాం...అంత త్వరగా ఎలా  వదిలేసుకుంటాం...

  • అందరూ అలానే మానుకుంటే... ఇక ప్రజలకి తిండి ఎట్టాగరా... ఎవరో  ఒకరు చెయ్యాలి కదా ఈ పని...

  • అరేయ్..మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో  కనిపెడుతూ ఉంటారటకదా...అలాగే కాస్త ఈ చీడ పీడలకు తట్టుకునే మంచి వంగడాలు పుట్టించడమో , కాస్త తక్కువ ధరకే కరెంట్ వచ్చేలా ఎదయినా ప్రత్యామ్నాయం కనిపెట్టడం చేస్తే మాకీ కష్టాలు  ఉండవు కదా (కాస్త లోక  జ్ఞానం తెలిసున్న మా మేనమామ రైతు చెప్పేది..)
ఇవి...వాళ్ళ రెస్పాన్స్...

రైతులందరి జీవితాల్లో కొన్ని సినిమాల్లో చూపించినట్టు .... పల్లెటూళ్ళో లంకంత కొంప... చుట్టూ పెద్ద తోట...పాడి .. ఎప్పుడూ కళకళలాడుతూ ఇల్లాలు, పిల్లలు ఇవేం రియల్ లైఫ్ లో ఉండవు. ఎక్కడో పది ఊళ్ళకి కూడా అలాంటి ఆసామి ఉండడు...ఒకప్పుడు బాగా బతికిన రైతు కూడా ఈ రోజుల్లో రైతు కూలీగా మారాల్సోచ్చిన పరిస్థితి  ...

మనం మన ఉద్యోగంలో  రాణించాలన్నా లేక వ్యాపారం బాగా అభివృద్ధి చెయ్యాలన్నా, సంపాదించాలన్నా... బాగా కష్ట పడతాం....కానీ మనం ఎంత కష్టపడినా...మనకి ప్రతిఫలం దక్కకుండా మన కంట్రోల్ లో లేని ఏదన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అడ్డుపడుతుంటే ఎంత బాధ గా ఉంటుంది మనకు... అదే ఫ్యాక్టర్ అలానే కొనసాగుతుంటే వెంటనే ఉద్యోగం మార్చేస్తాం ... అదే ఇక్కడ రైతు తన కష్టం తో పాటు...మానవుడి ఏ మాత్రం కంట్రోల్ లేని ప్రకృతి అనే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ని కూడా నమ్ముకోవాలి.



**************** 
కొన్నేళ్ళ క్రితం బెంగళూరులో ఉండే రోజుల్లో ఒకసారి రిజర్వేషన్ చేయించుకోవడానికి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అయిదో ఆరో కౌంటర్స్ ఉన్నాయి...దాంట్లో తక్కువ మంది క్యూ ఉన్న కౌంటర్ చూసుకుని నుంచున్నా... టైం కిల్ చెయ్యడానికి మొబైల్ తీసి ఆడుకుంటున్నాను... ఎప్పట్లాగే నేను నుంచున్న లైన్ తప్ప మిగతా లైన్లన్నీ స్పీడ్ గా కదులుతున్నాయి... కాసేపున్నాక .....క్యూ అసలు కదలడం లేదేమిటా అని అని చూస్తే కౌంటర్ దగ్గర ఒక ఆర్మీ జవాను ఒక చేత్తో రిజర్వేషన్ ఫార్మ్స్ కట్ట  రెండో చేత్తో వాళ్ళకొచ్చే కన్సెషన్ ఫార్మ్స్ కట్ట పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి ఇస్తున్నాడు. ఈ కన్సెషన్ ఫార్మ్స్ వల్ల మామూలు టికెట్ రిజర్వేషన్ చెయ్యడానికి కన్నా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా... క్యూ జనం లో కొద్ది అసహనం...ఈ లోపు ఒక టికెట్ రిజర్వేషన్ అయిపోగానే... అతను వేరే టికెట్ కి ఫారం ఇచ్చాడు. అప్పటివరకూ ఓపిగ్గా నించున్న జనం లో ఇద్దరు... "ఏం నువ్వొక్కడివే ఇంత టైం తీసుకుంటే మేం ఆఫీసుల్లో పర్మిషన్ తీసుకు వచ్చాం... మేం వెళ్ళొద్దా...ఎంత సేపు నుంచోవాలి  అని"  అని అరడవడం మొదలు పెట్టారు. అయితే అతను ఆల్రేడి ఒకసారి కొన్ని టికెట్స్ చేయించుకుని మళ్ళీ లైన్ లో వెనుక నుంచుని క్యూ లో వచ్చి మిగతావి చేయించుకుంటున్నాడు అని రిజర్వేషన్ ఆఫీసరు చెప్తున్నాడు కానీ నా వెనుక నుంచున్న ఈ ఇద్దరు వినిపించుకునే స్టేజ్ లో లేరు. వాళ్ళ హిందీ , కన్నడ డైలాగుల్లో కొన్ని అర్ధమయినవి ఏమిటంటే... ఫ్రీ గా టికెట్ వస్తున్నప్పుడు అందరికన్నా వెనక్కి నుంచోవాలి... ఫుల్ డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్లకి ప్రిఫెరేన్స్ ఇవ్వాలి అని... ఈ గొడవ జరుగుతుండగా... కొంచెం తటపటాయిస్తూనే ఆ జవాను లాస్ట్ టికెట్ కి రిజర్వేషన్ ఫారం ఇచ్చాడు. అంతే నా వెనుకున్న వాళ్ళు ఇక రెచ్చిపోయి తిట్టడం మొదలు పెట్టారు... దానితో అతను...కొంచెం ఫీల్ అయ్యి...ఇచ్చిన ఫారం మళ్ళీ తీసేసుకుని...వెనక్కి వెళ్లి నుంచున్నాడు...అలా వెనక్కి వెళ్తున్నప్పుడు అతని మొఖం లో ఫీలింగ్స్ చూసి...ఎందుకో నాకు కొంచెం బాధ కలిగింది ...వెంటనే నేను లైన్ నుండి తప్పుకుని... అతని వెనుక నుంచున్నా.. నన్ను చూసి ఇంకో ఇద్దరు నా వెనక్కి వచ్చారు. ఆ తరువాత  ఆరిచిన వాళ్ళలో ఒకడు కూడా వచ్చి మా వెనుక నుంచున్నాడు ...మిగిలిన వాడు మాత్రం ఇవేమీ పట్టనట్టు రిజర్వేషన్ చేయించుకు వెళ్ళిపోయాడు... వాడు వెళ్ళిపోతూ నన్ను కొంచెం చిరాగ్గా చూసి పోయాడనుకోండి...

నా  రిజర్వేషన్ అయిపోయాక వెనక్కి వస్తుంటే ... నాకు థాంక్స్ చెప్పడానికి ఆ జవాన్ అక్కడే నుంచున్నాడు... చాయ్ తాగుదామా అన్నాడు... నాకు కొంచెం మొహమాటం అడ్డొచ్చినా...సర్లే అని ఓకే అన్నా... అతనికి హిందీ తప్ప ఇంకేం రాదు...నాకు హిందీ అంతంత మాత్రం... ఫ్లాట్ఫాం మీద కాంటీన్ లో టీ తాగుతూ ఉంటే అతను చెప్తున్నాడు... అతనిది ఉత్తరప్రదేశ్ లో ఏదో మారు మూల పల్లె... ట్రైన్ లో డిల్లీ వెళ్లి అక్కడనుండి మళ్ళీ పదహారు గంటలు దూరం వాళ్ళ ఊరు ... ఇతని కుటుంబానికి  సైనిక నేపథ్యం లేకపోయినా ఆ ఊళ్ళో ఎక్కువ మంది సైన్యం లో పనిచేసేవారేనట.... భార్య , పిల్లలు , తల్లితండ్రులు అక్కడే ఉన్నారు... వాళ్ళని చూసి సంవత్సరం అయిందట... అతనికి అతని కొలీగ్స్ కి కలిపి రిజర్వేషన్ చేయించడానికి వాళ్ళ ఆఫీసరు ఒకరికే పర్మిషన్ ఇస్తాడట అందుకే ఆ పెద్ద కట్ట.... పెద్ద ర్యాంక్ కాకపోవడం తో జీతం అంత ఏమీ ఉండదు అనిపించింది. అలా కాసేపు మాట్లాడాక...వెళ్ళే ముందు టీ కి డబ్బులిస్తుంటే...లేదు లేదు నేను పిలిచాను కాబట్టి నేను ఇవ్వాలి అని పట్టుపట్టి అతనే ఇచ్చి వెళ్ళిపోయాడు...

నేను తిరిగి ఆఫీసుకి వచ్చాక ....జరిగిన సంఘటన మళ్ళీ నెమరు వేసుకున్నా....

అలా నలబై గంటల దూరం లో ... అందరిని వదిలేసి...సంవత్సరానికి ఒకసారే మాత్రమే ఇంటికివెళ్ళేలా ఉండే  ఊరిలో అప్పుడు నాకు వచ్చే జీతానికి రెట్టింపు జీతం వచ్చే ఒక ఉద్యోగం ఇస్తే నేను వెళ్తానా ?? అని.... ఆ తరువాత...అదే ఉద్యోగం లో ప్రాణాపాయం కూడా ఉంటే...అసలు ఎంత జీతమొస్తే వెళ్ళగలను అని ఆలోచించాను...అప్పుడు అనిపించింది....ఎంత ఇచ్చినా వెళ్ళలేను అని....కావాలంటే మా ఊరు వెళ్ళిపోయి ఆటో నడుపుకుంటూ అయినా బ్రతుకుతాను కానీ... ఆ ఉద్యోగం మాత్రం చెయ్యలేనోమో అనిపించంది....మరి అందరూ నాలానే అనుకుంటే ఇక మన సరిహద్దుని కాపాడేది ఎవరూ?

అప్పుడు అనిపించింది....కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత,  నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు.... ఇంకా ఏదో కావాలి... దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ... అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే....

మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన  వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం.... కనీసం కొంచెం గౌరవం ? 

ఈ రెండు ముక్కలు రాయడానికి ఇన్స్పిరేషన్ కలిగించే బజ్ రాసిన లలిత డి. గారికి ప్రత్యేక కృతజ్ఞతలు  ...
 
- మంచు

142 comments:

శ్రీనివాస్ said...

జై జవాన్ జై కిసాన్

మధురవాణి said...

Thanks for this thoughtful post!
అందరికీ ఎంత సేపూ మన డబ్బులు, మన తిండి, మన సుఖం, మన గోలే గానీ మనం హాయిగా బ్రతికగలిగే పరిస్థితులు కల్పిస్తున్న రైతులు, జవాన్లు లాంటి వాళ్ళని మాత్రం చిన్నచూపు చూస్తుంటాం. ఒకవేళ చిన్నచూపు చూడకపోయినా మన వంతు ఏమైనా చెయ్యగలమా అని ఆలోచించం. :(
జై జవాన్! జై కిసాన్!
ఉపాధ్యాయులంటే కూడా చాలామందికి కనీస గౌరవం ఉండట్లేదు ఈ రోజుల్లో..

భాను said...

మంచి టపా , ఇలా అల్లోచించే వాళ్ళు ఎంత మంది ఉంటారు. మంచి పోస్ట్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు

రవిచంద్ర said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం. గోదావరి జిల్లాలు, ఇతర నీటి కాలువల సౌకర్యం ఉన్న ప్రాంతాల మాట ఏమోగానీ మా ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా వర్షం మీదనే ఆధారపడతారు. అందుకనే మాకు వ్యవసాయం ఒక జూదం లాంటిది. మా ఊర్లో ఎవ్వరూ తమ బిడ్డలు వ్యవసాయదారుడు కావాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ఉద్యోగాల వైపు చూసేవాళ్ళే. వ్యవసాయం చేసేవాడు అన్నాడంటే పిల్లనిచ్చేందుకు కూడా వెనకాడే పరిస్థితి దాపురించింది.

Unknown said...

Chalaaaaaaaaaaaaaaa bagundi ...
nuvu intha deep gaa alochistavaa .. idi chadivaka nee meeda inkaaa gouravam pergindi :)

really ur a gem ..

మనసు పలికే said...

మంచు గారు, టపా చదువుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ నన్నావహించింది. ఏంటో ఏం రాయాలో కూడా తెలియడం లేదు. చాలా థ్యాంక్స్ అండీ ఇంత మంచి టపా ఇచ్చినందుకు. ఏదో గిల్టీ ఫీలింగ్.. No Words..

నేస్తం said...

చాలా బాగా రాసారు మంచుగారు.. నిజమే రైతులు పొలాలు అమ్మేసుకుని కూర్చుంటే తిండి పరిస్థితి ఏమిటి ...

శివరంజని said...

చదువుతుంటే మనసంతా ఏదోలా అయిపోయింది .. ఏమి కామెంట్ పెట్టలో తెలియడం లేదు .......చాలా చాలా బాగుంది ... .ఎంత మంచి పోస్ట్ రాసారండి ఈ పోస్ట్ చదువుతుంటే కొంచెం కాదు మీ మీద గౌరవం ఇంకా పెరుగుతుంది ... జై జవాన్ జై కిషాన్ & ఇంత మంచి పోస్ట్ ఇచ్చినందుకు జై మంచు గారు

వేణూశ్రీకాంత్ said...

చాలా చాలా బాగా రాశారు మంచుగారు. నిజమే కాస్తంత గౌరవం తప్ప వారికేమీ ఇచ్చుకోలేం.. ప్రతిఒక్కరు ఇలా ఆలోచించగలగాలి. జవాన్ విషయంలో మీరు చేసినది చాలా మంచిపని అలా ఆచరణలో చూపినందుకు అభినందనలు.

రాధిక(నాని ) said...

చాలా బాగా రాసారండి.బహుశాఒకటో ,రెండో తరాల తరువాత రైతు కుటుంభాలు ఉండవేమో నండి .అంతా కార్పోరేట్ వ్యవసాయమే అవ్వొచ్చు.ఇప్పుడు పల్లెల్లో పరిస్థితులు అలానే ఉన్నాయికదా .చాలా మంది వ్యవసాయమంటే చిన్నచూపోలేక కష్ట నష్టాలు భరించలేకో పెద్దదో చిన్నదో ఉద్యాగాలకోసం పట్నాలకు వలసలు పోతున్నారు.

కౌటిల్య said...

కొంచెం గౌరవం....టచ్ చేశారు..చాలా రాయాలనుంది,,కానీ రాయలేకపోతున్నా..ః(

నీహారిక said...
This comment has been removed by the author.
నీహారిక said...
This comment has been removed by the author.
Anonymous said...

@ మంచు పల్లకి : చాలా బాగా రాసారు . అందుకు కారణం నేనా! ( హాస్చర్యం ,ఆనందం)
మా నాన్నగారు, జై జవాన్
మా శ్రీవారు జై కిసాన్ .ఇప్పుడంతా నాకు రెండుసార్లు జై చెప్పాలి ( మీ ముందున్నది నేనేకాబట్టి)

శ్రీనివాస్ said...

@ నీహారిక ,

మంచుగారు మీతో గౌరవంగానే విభేదించారు. మీరే నువ్వు, నీలాంటి వాళ్ళు అంటూ ఏకవచన సంభోదన చేస్తూ అగౌరవంగా మాట్లాడుతున్నారు.

Anonymous said...

పైన మీ వదినకు ఏదో కాలుతుందట.. ఏంటో కనుక్కోండి మాష్టారు..

నేస్తం said...

లలిత గారు అవునా.. మీ నాన్నగారు జవానా?సూపరు :)
వాళ్ళకు రెండు సార్లు కాదు ఎన్నిసార్లైనా జై కొట్టచ్చు కాని ..మీకెందుకు కొట్టాలి అనేది నా ప్రశ్న

నీహారిక said...
This comment has been removed by the author.
తృష్ణ said...

"మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం.... కనీసం కొంచెం గౌరవం ?"
వారికి దక్కాల్సింది బోలెడు గౌరవం..
మనం తీర్చుకోలెనిది వారి ఋణం.
మంచి టపా రాసారు.

నీహారిక said...
This comment has been removed by the author.
Sravya V said...

మంచు గారు మీ ఎప్పటిలాగానే మీ పోస్టు అద్భుతం గా ఉంది . కాని మీరు చెప్పే విషయం తో మాత్రం నేను కొద్దిగా విభేదిస్తాను . ప్రపంచం లో ఉన్న వృత్తుల్లో ఇది కొద్దిగా ఎక్కువ ఇది కొద్దిగా తక్కవ అనేది ఏది ఉండదు , అలా ఆలోచించటానికి మన శరీరం లో ఒక అవయవం చాల మంచిది, ఇంకొకటి కొంచెం తక్కువ మంచిది అని చెప్పటానికి పెద్ద తేడాలేదు .

ఒక్కసారి emotions వదిలి ఆలోచిస్తే అది మీకే అర్ధమవుతుంది . కాకపొతే మనం మనుషులం emotions ఉంటాయి కాబట్టి అది సాధ్యం కాదేమో. ఉదాహరణకి ఒక బస్సు డ్రైవర్ ని తీసుకోండి నేను చెప్పనక్కర్లేదు ఒక రాత్రి పూట ప్రయాణం చేస్తూ మీ తోటి ప్రయాణికులు అందరూ నిద్రపోయే సమయం లో ఒక్క సారి అతని పరిస్తితి ఊహించండి. అలాగే ఒక డాక్టర్ తను ఈ పరిస్తితుల్లో ఉన్నా వేరే వాళ్ళకి అవసరం ఐనప్పుడు స్పందిచాలిస్తే కాదంటారా . రాజకీయనాయుకుడు , పోలీసు వీళ్ళ వృత్తలు ? బొగ్గు గనుల్లో , ఫార్మ కంపెనినలో అందరూ కాకపోయినా చాలా మంది తమ ఆరోగ్యం కి కలిగే హాని ని పక్కన పెట్టి కష్ట పడేవాళ్ళే కాదంటారా ? కాకపొతే మనకి ఇక్కడ కనిపుస్తుంది వీళ్ళ అందరికి ప్రకృతి తో సంభంధం లేకుండా నెలకి ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో డబ్బు కనపడటం . కాని జీవన ప్రమాణాలని కొలవటానికి అదొక్కటే చాలదు .

ఇదంతా చదివి నాకు కొద్దిగా కుడా మనస్సు లేదు అని జనాలు నా మీద దండయాత్ర చేస్తారేమో నేను చెప్పదలుచ్కున్నది ఒక్కటే "ఆ వృత్తి నైనా నిబద్దత తో చేసే వ్యక్తీ గౌరవనీయుడు , అతని వల్ల ఆ వృత్తికి గౌరవం వస్తుంది . అలాగే ఈ పని ఇంతేనా అని ఓస్ అని తీసివేయ్యనవసరం లేదు దేని విలువ దానికే ఉంటుంది .

Sravya V said...

నీహారిక పోనీ ఈ పోస్టు రాసిన ఆయనికి ఆ అర్హత లేదు అనుకుందాం మరి మీరు అదే చేస్తున్నారు ఒక్కసారి మీరు రాసింది ఒక్క సారి చూడండి. అలా రాసిన తరవాత మీకు వేరే వాళ్లకి చెప్పే హక్కు ఉందంటారా ? ఇది నా అభిప్రాయం మాత్రమే ఇంతమంచి బ్లాగులో మన అభిప్రాయబేధాలతో రొచ్చు రొచ్చు చేయటం అంత మంచి పని గా తోచలేడం లేదు . నేను చెప్పిన దాంతో మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీ బ్లాగులోనన్న , లేదా నా బ్లాగుల్లో నాన్న మనం వాదించుకుందాం ఏమంటారు ?

Anonymous said...

పైన అసందర్భంగా వ్యాఖ్యలు రాసిన తెలుగింటి ఆడపడచుకి ఎమైన పిచ్చి ఉందా? ఆమేని వ్యక్తిగతం గా కలసినవారు ఎవరైనా బ్లాగులోకం లో ఉంటె ఆవిడ మాన్ససిక పరిస్థి గురించి ఒక టపాలొ తెలియ జేసేది. ఆమే ప్రవర్తన ప్రతి పదిహేను రోజులకి మారుతూ ఉంట్టుంది. అందరిని రా, రే అని పిలవటం ఆవిడకి ఒక ముచ్చట. ఆవిడ ఇదే పంథాను కొన సాగిస్తే ఆవిడని జగదేక వీరుని కథ సినేమా లో బి.సరోజ ఆడవేషం లో ఉన్న రాజనాలని "వసే, ఎమే, ఎమిటే" అని పిలిచినట్లు గా పిలవ వలసి వస్తుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఎంతో ప్రభావితం చేసే విధంగా రాశారండి. అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టు విషయం చెప్పారు.
వాళ్ళందరికీ తల్లీదండ్రులకు ఋణపడి ఉన్నట్టు రైతులకు, సైనికులకు మనం ఋణపడి ఉండాల్సిందే.
అవునూ,మీలాంటి తెలివైన వాళ్ళు (నిజంగానే) ఏదైనా కనిపెట్టాలండీ-వరదలు, కరువులు, దొంగలు, దొంగలు కావాలనే తోలే పశువులు, సెజ్లంటూ వేధించే రాజకీయ దొంగలు -వీళ్ళబారినుంచి రైతులను కాపాడటానికి !

సైనికవీరులకు కావలసిన కనీస సదుపాయాలు (చలి నుంచి కాపాడటానికి, వేరే కనీస నిధులు వెంటనే మంజూరుచేయటానికి,
రైతులకు గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా ఇచ్చేటట్టు చేయటానికి (సూపరుమార్కెట్లో వెయ్యి రూ.నోట్లు, కంపెనీ స్లిప్పులు తీసి తీసి ఇచ్చేస్తాం!) మనం పోరాడాలి కదా!

శ్రావ్యగారు, అన్నీ వృత్తులూ మంచివే, గొప్పవే. కానీ వాళ్లంతా ఈవేళే పని మానేసినా, మన జీవితాలు మారతాయి అంతే.
రైతులు, సైనికులు మనకు ప్రాణభిక్ష పెట్టేవాళ్ళు. అవి అన్నీ సౌకర్యాలు. ఇవి ప్రాణావసరాలు.
వైద్యం కూడా సౌకర్యమేనంటాను.
మంచుపల్లకీ గారు, లలిత గారు అభినందనీయులు. ఇంత గొప్ప విషయాన్ని చర్చించినందుకు.

Sravya V said...

మందాకినీ గారు ఊహు తిండి ప్రాణావసరం , వ్యవసాయం కాదు , వ్యవసాయం అనేది ఒక వృత్తి గా మారి ఒక వెయ్యి సంవత్సరాలు అవుతుందేమో అంతకు ముందు ? మన అవసరాలు పెరిగే కొద్ది ఈ వృత్తులు పెరిగాయి కాదంటారా ? ఇక రక్షణ కూడా మనం ఉన్న ఈ కాంప్లెక్ష్ ప్రంపంచం లో అవసరం అంతే కాని నిజం గా మనిషి బ్రతకటానికి కాదు కదా ?

ఈ వృత్తులకి ఈనాటి సమాజం లో తగిన గౌరవం లభించటం లేదు అనేది నేను అంగీకరిస్తాను , అది మనలో ఉన్న చాలా మంది ఆలోచన దోరణి లో ఉన్న తప్పు . కాకపొతే మిగినలిన వృత్తులు అంతే విలువ కలిగినవి అని చెప్పటం నా ఉద్దేశ్యం అంతే !

cheekati said...

మా ఏరియాలో ఎక్కడ ఆర్మీ సెలెక్షన్స్ ఉన్నా, మా వూర్లో ఇంటర్ పూర్తైన వారు చాలా మంది వెహికల్స్ మాట్లాడుకొని గ్రూపులుగా సెలెక్షన్స్ లో పాల్గొని వస్తుంటారు.కొందరు సెలెక్ట్ అవుతారు,మిగతా వారు వేరే కోర్సులు జాయిన్ అయి నెక్స్ట్ అటెంప్ట్ కి మల్లీ ప్రయత్నిస్తారు. ఏదో ఒక జాబ్ సంపాదించుకొని సొంత కాల్ల మీద నిలబడాలనే తాపత్రయంతోనే ఎక్కువ మంది వెల్తారు తప్ప, దేశరక్షణ లాంటి పెద్ద పెద్ద పదాలు వారికి తెలీవు.
I completely agree with Sravya's opinion about this.

Anonymous said...

బహుషా చాలామంది నాతొ విభేదించొచ్చు. కానీ, నాకు ఈమధ్య కొన్ని భావాలు భయంకరంగా బలపడుతున్నాయి. అది కూడా మన సినిమాల వల్లే. ఈ మధ్య సాఫ్టువేరు ఇంజినీరు అనగానే వాడో పెద్ద వెధవ అన్నట్లు, విలాసాలు భోగాలు తప్ప యేమీ భాధ్యత లేని, సమాజానికి పనికిరాని వెధవ అన్నట్లు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. పోలీసు అనగానే దేశా సేవకుడు అయినట్టు, తెగ చూపిస్తున్నారు. పోలీసులు దేశ సేవ చేస్తున్నారంటే నాకే బాధలేదు. కానీ, ఈ సినిమా వీల్లు సాఫ్టువేరు వాల్ల మీద పడి యెందుకు యేడుస్తార్రా బాబూ అనుకునే వాన్ని. నిదానంగా ఈ ఆలోచనే మిగిలిన వాటికి కూడా పాకింది.


కొన్ని పనులు కొంచెం కష్టమైనవే అయినా, యేదీ ఊరికే ఎవరూ చేయడం లేదు. అసలు అన్నదాత అనాల్సిన అవసరమేంటో నాకు అర్థం కాదు. బహుషా, సోషలిస్టు భావజాలములోంచి వచ్చినవే అవన్నీ అనుకుంటా. అందరిలానే వారూ పనులు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఎవరైనా దాతలు ఎలా అవుతారు? ష్లుంబెర్జెర్ (schlumberger) అనే ఆయిల్ కంపెనీలో పనిచేసే వారిని, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ లతో పిలవడానికే తప్ప, ఒక ఊరు అని చెప్పడానికి వీలు లేని ప్రదేశాలలో పనులు చేయమంటారని విన్నా. అంతెందుకూ, మన ఆయిల్ కంపెనీలు కూడా కొన్ని సముద్రాలలో ఉంటాయి. రోజూ పొద్దున్నుండీ రాత్రివరకూ సెవెన్ సీటర్ ఆటోలు నడిపేవారూ ఉన్నారు. వీరికి సెలవులు అంటు ఉంటాయో లేదో తెలీదు. యెర్రటి యెండలో, యెటువంటి సౌకర్యాలు లేకుండా, తారు రోడ్లమీద రోడ్డు మరమ్మత్తు పనులు చేసే కూలీలు ఉన్నారు. కొంతమంది యెండాకాలములో వడదెబ్బ కొట్టి చనిపోతూంటారు కూడా.

కొన్ని నెలల క్రితం నేను డిళీ వెల్లినప్పుడు, డిల్లీలో రిక్షా ఎక్కాను. నేను, నా ఫ్రెండు ఇద్దరం రిక్షా ఎక్కితే, దాదాపుగా 40 అంతకంటే యెక్కువుండొచ్చు అతనికి, యెర్రటి యెండలో తొక్కుకుంటూ తీసుకెల్లాడు. అయినా సరే అతను అడిగినంత డబ్బు ఎవ్వరూ ఇవ్వరు. బేరమాడతారు. నా ఫ్రెండు కూడా బేరమాడే రిక్షా ఎక్కాడు. వాల్లెవ్వరినీ దాతలు అనం, ఎందుకు? బహుషా, రైతుకూ, సైనికుడికీ కొంచెం భావజాలవల్ల వచ్చిన అండ, కొంత గ్లామర్ ఉండడం వలన అనుకుంటా వారికి అలాంటి
పేరొచ్చిందేమో అనిపిస్తుంది.

పద్మవల్లి said...

చాలా బాగా రాసారండీ. నేను కూడా మీ లాగే, నేనైతే అలా ప్రాణభయం ఉన్న వృత్తి లోకి వెళ్ళగలనా అని అనుకుంటాను. వాళ్ళు చేసేది త్యాగం అయినా, తప్పని పరిస్థితిలో వెళ్ళినా సరే.
మీరు రిజర్వేషన్ కౌంటర్లో చేసిన పనికి మీకు అభినందనలు. అది ఆ మనిషి పట్ల మనకు ఉండాల్సిన కనీస గౌరవాన్ని, మీ సంస్కారాన్ని తెలియచేస్తుంది. ఎవరైనా వయసు మళ్ళిన వల్లూ ఉన్నప్పుడు కూడా నేను అదే పధ్ధతి అనుసరించేదాన్ని. జనాలు నను పిచ్చిదాన్నిలా చూసినా సరే. నా ఆత్మ సంతృప్తి నాకు ముఖ్యం.

పద్మవల్లి

నీహారిక said...
This comment has been removed by the author.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

శ్రావ్యగారు, ఆకాశరామన్న గారు
మీరు చెప్పేది అక్షరసత్యమే. కాదనను.
అన్ని పనుల్లో కష్టపడి చేసే పనిని, చేసే వాళ్లని గౌరవించాలి.
కానీ, ప్రతి పనికీ ప్రతిఫలం తక్కువో, ఎక్కువో లభిస్తుంది.
కానీ రైతు విషయంలో ఇది దైవాధీనం.
సైనికుని ప్రాణం ఎప్పుడూ గాలిలో దీపమే.
సరే, మనం వాదించుకోవటం ఎందుకు లెండి. హి.

Sravya V said...

నీహారిక నటించాల్సిన అవసరం లేదు నాకు లేదు . నాకు తెలిసింది నాకు తెలిసిన భాష లో చెబుతాను అదీ గౌరవం గా . ఇక హిందూ , ముస్లిం గోల మీ బ్లాగ్లో అడిగినప్పుడు చూద్దాం . ఇక ఈ బ్లాగరు ని అంటే ఫీల్ అవుతాను ఎందుకంటే ఇక్కడ మీరు అనవసరం గా అన్నారు అని నాకు అనిపించింది కాబట్టి . ఇక నాకు ఎక్కడ మంచు పల్లకీ గారు మీకు సమాధానం ఇచ్చినట్లు కనపడలేదు మరి మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ? ఇక నా సంగతి అంటారా కెక్యూబ్ గారి బ్లాగేనా , ఇంకా వేరే దగ్గర కూడా చూడచ్చు ofcourse అది మీకు తెలిసే ఉంటుంది !

ఇక 1. నేను వాడిని చాచి చెంప దెబ్బ కొట్టాలి.
2. వాడు నా కాళ్ళమీద పడి క్షమార్పణ అడగాలి.

ఈ వాక్యాలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా .

Mauli said...

మ౦చు గారు,

నేను రైతుబిడ్డ నే..ఇప్పుడు ౧౦ లక్షలు ఉన్న పొలమ్ విలువ రేపు ౨౦,౪౦ లక్షలు కావచ్చు ..పైన వచ్చే ఆదాయ౦ మిగులు ...

ఊరిలో ఇ౦కా మ౦చి ఫెసిలిటీస్ ఉన్న ఉద్యోగ౦ వస్తే మా ఊరి వారెవరూ ఆర్మీ జవానులు గా వెళ్ళే వారు కాదు :)

ఇక మీ పోష్టు అ౦టారా..బాగు౦ది..సినిమా, కధ చదివినట్లు, ప్రేక్షకుల గు౦డె ఆ కాస్సేపు పి౦డేసారు :)

నేస్తం said...

శ్రావ్య,ఆకాశరామన్న నాకు వాధించడం అయితే రాదు గాని ఎన్ని సార్లు చదివినా మీతో విభేదించి మంచుగారితో ఏకీభవించాలని అనిపిస్తుంది ..మరి మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే ..ఒక్కోసారి రెండు రోజులకోమారు ఇంటికొస్తారు .వారానికి ఆరు రోజులు రాత్రి 12 గంటలకే వస్తారు ..తన బాధ నాకు తెలుసు ...అయినా సరే ఊహు ఊహు ఒప్పుకోలేకపోతున్నా :D

రాజ్ కుమార్ said...

చాల బాగుందండీ.. ఈ మధ్య కాలం లో నేను చదివిన మంచి, గొప్ప పోస్ట్..
జై జవాన్ జై కిసాన్..

Sravya V said...

నేస్తం గారు చెప్పగా మన emitions అలా అడ్డుపడతాయి అని :) ఇక్కడ రైతులని తక్కువ చేయటం నా ఉద్దేశ్యం కాదు చిన్న example అందరూ అంత మంచి వాళ్ళైతే మన దేశం లో ఆహర పంటల విస్తీరణం కన్నా వాణిజ్య పంటల విస్త్రీరణం ఎక్కువ కాదు . అలాగే ప్రభుత్వాలు రొయ్యల చెరువుల వలన పంట పొలాలు నాశనమవుతాయి అని మొత్తుకుంటున్నా సరే వాటి విస్తీరణం విపరీతం గా పెరగదు . సో మిగిలిన రంగాల లో వారిలాగా ఇక్కడ కూడా కొంత మంది స్వార్ధపరులు ఉన్నారు అలాగే మిగిలిన రంగాలలో కూడా నిజాయితీ పరులు ఉన్నారు అని నా ఉద్దేశ్యం :)
ఇక రక్షణ శాఖ లో నిజమే వాళ్ళ ప్రాణాలకి తెగించాలి కాని అందరు అంత నిస్వార్ధం గా ఉంటే అందులో జరిగే స్కాముల మాట ఏమిటి ? మామూలు గా అందరు అనుకునట్లు గా నిజం గా వార్ అంటే మొదలైతే పోలో మని అందరి ని యుద్దానికి పంపరు ముందు గా వయస్సు పై పడిన వాళ్ళని పంపుతారు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఒక్కొక్క సైనికుడి మీద ఇంట ఖర్చు పెడుతున్నాము ఇంతనిని కోల్పోతే నష్టం ఎంత అని .
ఇలా అని నేను వాళ్ళ సేవలని తీసిపడేయటం ఇవాళ్ళ మనమందరం "పోలీసులు " ఆ తీసిపడేస్తాం కాని మీకు గుర్తుంది గా "హేమంత్ కర్కరే , విజయ్ సలాస్కర్ " వీళ్ళంతా ఎలా చనిపోయారో . ఆ వృత్తికి గౌరవం వాళ్ళ వాళ్ళ వచ్చింది ఇది ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది .

3g said...

మందాకిని గారూ చాలా థేంక్సండి శ్రావ్య గారి కామెంట్ చదివాక నిజమేకదా అనిపించింది గాని మీ వివరణ చూశాక మళ్ళీ నా అబిప్రాయం బలపడింది.
మంచు గారికి జై..
లలిత గారికి డబల్ జై...
//మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం.... కనీసం కొంచెం గౌరవం ?//
.................

వజ్రం said...

జై జవాన్ జై కిసాన్
@శ్రావ్య వట్టికూటి
నేను మీతో విభేదిస్తున్నాను
పెట్టుబడి,రిస్క్‌,పనిభారం, దానిపై వచ్చే ప్రతిఫలం, వీటి ఆధారంగానే ఒక వృత్తిని అంచనా వేయగలం.ఏ విధంగా చూసినా రైతు, సైనికుల వృత్తులలో రిస్క్ తో పోలిస్తే ప్రతిఫలం తక్కువ. మానవుడు సామాజిక జీవనం మొదలు పట్టినప్పటినించీ ఉన్న ప్రాచీన వృత్తులవి.వారులేకుండా మానవ మనుగడ అసాధ్యం.

Anonymous said...

తులసి మొక్కల్లాంటి కలుపు మొక్కలా కామెంట్లు పెట్టింది ఎవరయ్య ఈ నీహారిక? పని పాట లేదా

Anonymous said...

మనిషి ప్రాధమిక అవసరాల్లో మొదటిది ఆహారం ( ఆ మాటకొస్తే ఏ ప్రాణికయినా అనుకోండి.)
సృష్టిలో ప్రతీ ప్రాణీ తన ఆహారాన్ని తనే సంపాదించుకోవాలి. కానీ మనుషుల్లో ఆ బాధ్యత తీసుకున్నవాడు రైతు ( ఊరికే కాదనుకోండి) . కాబట్టి అందరికంటే అతనికి కాస్త ఎక్కువ గౌరవం ఇవ్వటంలో తప్పులేదేమో .
ఊర్లో చాకలీ, మంగలీ, కుమ్మరి వడ్రంగీ అంతా గిట్టుబాటుకాని పనులు వదిలేసి పట్నాలకి పోతున్నారు. ఏదో ఓ కూలిపని చేసుకోవచ్చని. వాళ్ళు చేసే ఆయా పనులు మిషన్లు ద్వారానో, సొంతంగానో ఎలాగో ఎవరికి వారే చేసుకుంటున్నాం. మరి రైతులు కూడా గిట్టుబాటుకాని వ్యవసాయం వదిలేసి పట్నాల్లో ఏదో ఓ పని చూసుకుంటే పంటలు పండించి, మార్కెట్ కు పంపే మిషన్ లు ఉన్నాయా. లేక ఎవరికి వారే బాల్కనీల్లో పండించేసుకుంటారా

Anonymous said...

"మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం.... కనీసం కొంచెం గౌరవం" ....? గౌరవం తో రుణాలు తీరేలా ఐతే అందరం వారి ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ,నెలకొక సారి సన్మానాలు చేద్దాం.రైతులకి, సైనికులకి కావలసింది గౌరవాలు,జై,జై లుకాదు. సైనికులకి కావలసింది మంచి సాంకేతిక ఆయుధ సంపత్తి,సౌకర్యాలు, ఒకవేల ఏదైనా ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి చేయూత. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి కోసం శవపెట్టల్ని కొనడంలో కూడా స్కాములకు పాల్పడ్డ ఘన చరిత్ర మనది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అట్లే, జై కిసాన్ అని వారికి గౌరవం ఇచ్చినంత మాత్రాన రైతు ఆత్మహత్యలు ఆగుతాయా..? రైతు కష్టపడి పండించిన పంటకు గౌరవ ప్రదమైన గిట్టుబాటుధర కలిగించాలి. ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరిత్యాలలో పంట కోల్పోతే, ప్రభుత్వం తరపున పంట భీమా ఇవ్వాలి. అన్నిటికంటే ముందు ఎమోషన్ తో కాకుండా కూల్ గా ఆలోచించాలి. ఎమోషన్ ఎక్కువైనోల్లు 'పరమవీరచక్ర ' సినిమా కెల్లాలి. ;-)

kiran said...

చాలా బాగా రాసారు మంచు గారు...
ఇలాంటివి చదివినప్పుడు...వీల్లిద్ద్దరికి.. మరో సారి salute చేయాలని అనిపిస్తుంది...
గుర్తు చేసినందుకు thank you .. :)

ఇందు said...

అయ్యబాబొయ్! పోస్ట్ చదివాక ఒక ఫీలింగ్...కామెంట్స్ చదివాక ఇంకో ఫీలింగ్ కలిగాయి.నాకు తెలిసినంతలో నేను కొంచెం చెప్తా. ఎవరి ఉద్యోగాల్లో రిస్క్ లేకుండా..ఎవడూ జీతం ఇవ్వడు.అది సాఫ్ట్వెర్ జాబ్ అయినా....ఆర్మీ జవాన్ అయినా.....పైలెట్ అయినా...ఎవరైనా కొంచెం కూడ శ్రమ పడకుండా పనిచేయాలంటే వీలుపడదు.కానీ సైనిక వృత్తి అనేది అన్నీ పణంగా పెట్టి...చావో బ్రతుకో తెలియకుండా అడుగిడే ఉద్యోగం.ఇక రైతుది...దినదిన గండం....నూరేళ్ళా ఆయుష్షు!ఎప్పుదు ఏ వరద వస్తుందో..ఎప్పుడు కరువొస్తుందో దేవుదికే తెలియాలి.కాని మిగితా ఉద్యోగాల్లో ఒక స్థిరమయిన ప్రణాళిక ఉంటుంది.ఇప్పటికి కొన్ని వేలమంది సాఫ్ట్వెర్ ఇంజినీర్లు దేశానికి దూరంగా బ్రతుకుతున్నారు.కానీ వారికి జీవిత భద్రత ఉంది.రేపు ఆఫీస్ కి వెళితే మన మీద గురిపెట్టి టార్గెట్ చేసే గన్నులు ఉండవుగా! అందుకే జై జవాన్ అన్నది :) ప్రకృతి మీద ఆధరపడి...ఎప్పుడు ఏది జరిగితే దానికి అణుగుణంగా జీవిత ప్రమాణాలు నిర్ణయింపబడే వృత్తి వ్యవసాయం.మరి జీవితాన్ని గాలికొదిలేసి ఎల జరిగితే అలా కానీ అని మనం ఊరుకోగలమా? అందుకే జై కిసాన్ అన్నది :)

మంచుగారు...మీ పోస్ట్ చాలా బాగుంది.ఎప్పటిలాగే ఆలొచించే విధంగా ఉంది :) కొంతమందికైనా ఈ మాత్రం స్ప్రుహ ఉన్నందుకు సంతోషంగా ఉంది :)

మంచు said...

శ్రావ్యగారు, అకాశరామన్న, చీకటి గారు...
ధన్యవాదాలు. ఒకరికి కొంచెం గౌరవం ఇమ్మంటే పక్కవారిని కించపరుచుకున్నట్టు కాదు. నేను చేసే పని పట్ల నాకు చాలా గౌరవం ఉంది...నా కుటుంబం చేసే వృత్తిపట్ల ఇంకా గౌరవం ఉంది. నా అభిప్రాయాలు (ఇంచుమించు వజ్రం, ఇందూ గారు చెప్పినవే) మరింత వివరంగా తెలపడానికి ప్రయత్నిస్తాను.

krishna said...

@ మంచు గారు
ఎక్సలెంటు పోస్టు అండి. చదివినంత సేపు గుండెలు పిండేసిన ఫీలింగు. కానీ............................ నా ఆలోచనా విధానానికి మీ ఆలోచనా విధానానికి చాలా తేడా వుంది. నేను శ్రావ్య గారి తో ఏకీభవిస్తాను. ఊఊఊఊప్స్ నాకు మీకు గొడవలు అయ్యాయి కదా , నేను మీ ఇద్దరి లో ఎవరితో కూడా ఏకీభవించకూడదేమో బహుశా ;) [ courtecy one of the above commenters]
మానవ జాతికి వున్న భావొద్వేగాలు వలన మన ఆలోచనలు ప్రభావితం అవుతాయి. ఈ మధ్యనే ఎక్కడో ఒక రచయత్రి మనసు తో ఆలోచించాల్సిన వాటిని మెదడు తో ఆలోచిస్తుంది అని ఎవరో విమర్శించారు. కొంత మంది అంతే! నేను కూడా.. మన దేశం విభజన కి గురి అవ్వక పోతే ఇదే అభిప్రాయం మన జవాన్ల పై వుంటుందా? దేశ విభజన ద్వేష ప్రేరితం. కొంత మంది సంకుచిత రాజకీయ నాయకుల స్వార్ధం. మానవ సహజ స్వభావం. యూరప్‌లో జవానల్ పరిస్థితి ఇలా లేదు కదా!
వ్యవసాయం లాభదాయకం అయితే మన రైతన్నలకి ఈ పరిస్థితి వస్తుందా? మన మానవ జాతి తనకి తానే ఎంతో నష్టం చేసుకుంటుంది. మిగిలిన జీవరాశులకి వున్నంత ప్రశాంతత మనకి లేకుండా మనమే చేసుకుంటున్నాము. ఎందుకంటే అవి పేద ధనిక తేడా లేని జాతులు. రైతులని దోపిడి చేస్తుంది మనమే! మన వ్యవస్థ ఇలా వుండడానికి మనమే కారణం. సమ సమాజం ఒక కల. ఆ కలలో అందరు సమానమే! కానీ ఆ కల నెరవేరడం దుర్లభం. చైనా ని చూపించి కమ్యూనిజాన్ని బూతులు తిట్టే వారు రష్యా ని తిట్టరు ఎందుకంటే అది కమ్యూనిస్టు సానుభూతి దేశమైనా మన మిత్ర దేశం కాబట్టి. ఇక్కడ కూడా మానవ సహజ ద్వేష బుద్ధే కారణం. ( చైనా ద్వేషం మన పైన .. మన ద్వేషం కమ్యూనిస్టు చైనా పైన )
ఎప్పుడో ఒక పాత ఫ్రెండు మనుషులే లేకపోతే ఏ బెడద వుండదు. బాంబ్లేసి లేపెద్దామా అన్నాడు. మానవ జాతి ఒక డిస్ట్రక్టివ్ రేస్. i agree now.

krishna said...

@ మంచు గారు
మొన్న NDTV ఇండియాలో అనుకుంటా .. కొంత మంది బడుగు వృత్తుల వారి గురించి చూపించారు. ఆకలి మీద సెక్షన్ 144 అని శీర్షిక.. రోజుకి 12 డజన్లు (144) పాకెట్లు బొట్లు , చంపిన్నులు లాంటివి తయారు చేస్తారు వాళ్లు. ఒక రోజుకి 2.50 రుపాయలు అనుకుంటా వారి బత్తెం. వేరె దారి లేక ఇలాంటి పనులు చేసె వారు వున్నారు. వారి పై కూడా జాలి చూపాలి గాని , గౌరవం చూపుతామా మనమెవరమైనా ? ఈ రెండు వృత్తులు భావొద్వేగాల తో కూడుకున్నవి. ఆ భావొద్వేగాలు మానవ సహజం.. అవి తక్కువ వున్న నాలాంటి defective పీసులు ఇలా ఆలోచిస్తాయి.

మంచు said...

నీహారిక గారు:
పైన డైలాగులు గుర్తున్నాయి. మూడు కామెంట్లకు మద్యలొ మీరు రెచ్చగొట్టిన కామెంట్లు ఎడిట్ చేసి బాగానే రాసారు.
నన్ను అరేయ్ ఒరేయ్ అనే మిమ్మల్ని ఒసెయ్ అని పిలవడం ఎంత సేపు చెప్పండి...కానీ నన్ను పెంచబడ్డ విధానం వేరు. నాకొసం ఒక పొస్ట్ కేటాయించి మరీ బూతులు తిట్టినా మీకు.... "అవిడ మా వదిన అందుకే అంత చనువు" అని సర్ది చెప్పిన నాకు ....... సంస్కారం లెవెల్స్ లొ ఉన్న తేడా చాలానే ఉంది... ఇక మీ లెవెల్ కి ప్రస్తుతానికి నేను దిగజారలేను.

నీ సాటి మనిషిని గౌరవింఛడం చేతకానివాడివి రైతుల గురించి, జవాను గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు >> సాటి "మనిషికయితే" గౌరవం ఎప్పుడూ ఇస్తాను. టెర్రరిస్టులకి మీద ప్రేమ కురిపించే మీకు , జవాన్‌కి గౌరవం ఇచ్చే నాకు చాలానే తేడే ఉంది.

ఇక ముఖ్యం గా నాకు ఆప్షన్స్ ఇచ్చేటంత దృశ్యం మీకు లేదు. అది మీరు గమనించాలి.

Anonymous said...

మంచుపల్లకీ గారు మంచి టపా రాసారు. కానీ మనం రైతు కి ఇవ్వగలిగింది కొంత గౌరవం మాత్రమేనా?. లాభసాటి కాకపోయినా కనీసం నష్టాలు రాకుండా వుండేలా అవ్వలేదా వ్యవసాయం?.
జె.పి గారి ప్రసంగం అసెంబ్లీలో . http://www.youtube.com/watch?v=sUE5U48oWuA
లోక్సత్తా వారి మ్యానిఫెస్టో. http://www.loksatta.org/cms/index.php?option=com_content&view=article&id=78&Itemid=89 ఇందులో కనీసం పెద్ద డబ్బు ఖర్చు లేని "Agri Clinic" లాంటి పనులు కూడా ప్రభుత్వం చెయ్యలేకపోతోంది.
రాజమౌళి "Come on India" వ్యవసాయం పై ప్రోగ్రాం ఇది. ఇందులో జె.పి గారితో బాటుగా నాగేశ్వర్ గారి అభిప్రాయం కూడా చూడొచ్చు . http://www.youtube.com/watch?v=QMrgo3M1Mto

Anonymous said...

నీహారిక wrote...
"హిందువులందరికీ మళ్ళీ చెపుతున్నాను. ఎప్పటికయినా త్యాగం చేసేదీ, చేయించేదీ ముస్లిం లు మాత్రమే."

Who are you?. Are you not a Hindu?

Anonymous said...

మంచు మీరేందుకు ఆమెని ఒసే అని పిలవాలి దానికి నేను ఉన్నాను గా "ఒసే ఏమే ఎమిటే "? మీకు చెపితె అర్థం కాదా? ఎమీ కావాలి నీకు. ఇంగె ఉనకు ఎన్న వేల? ఎదుకు గాలాట పండ్ర? పో !

*Who are you?. Are you not a Hindu
*ఆమే చూడ బోతె కొత్తగా నంబర్ 10 వర్గం లో చేరినట్లు ఉంది. :-)

శ్రీనివాసరాజు said...

మంచు గారు
ఆద్భుతంగా రాసారు.

ఒక రైతు, ఒక వీరజవానుకి ఇచ్చే గౌరవం చూస్తే బాధెస్తుంటుంది. వ్యవసాయం మీదున్న చిన్నచూపు పోవాలి. వ్వవసాయమే దేశానికి ఆధారం అని జనాలు తెలుసుకోవాలి. మరళా వీరికా గౌరవం దక్కాలని ఆశిస్తున్నాను.

sunita said...

మంచి పోస్ట్. వ్యసాయానికి మల్హ్ల్హీ మంచి రోజులు రావాలి.

హరే కృష్ణ said...

Excellent!

నాగప్రసాద్ said...

నేను ఈ ప్రపంచంలో మొదటి స్థానం పంటలు పండించే వారికి ఇస్తాను. తర్వాతి స్థానం రక్షక వృత్తిలో ఉన్నవారికి ఇస్తాను. ఎందుకంటే, తిండి లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మనం ప్రొద్దున్న లేవగానే కనీసం కాఫీ అయినా మన మొహాన పడితేగానీ పనిలోకి వెళ్ళలేం. కార్మికులు స్ట్రయికులు చేసినట్టుగా, ఉద్యోగులు పెన్ డౌన్లు చేసినట్టుగా రైతులు ఒక్క సంవత్సరం పంటలు పండించడం ఆపేస్తే తెలుస్తుంది. అప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిండి దొరకని పరిస్థితి ఏర్పడి, ఒకర్నొకరు చంపుకోవడానికి వెనకాడకపోయినా ఆశ్చర్యం లేదు. మిగిలిన వృత్తులు ఏవి లేకపోయినా పెద్దగా నష్టం లేదు. మహా అయితే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలు ఉండవు అంతే. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయం తప్ప మిగిలిన వృత్తులన్నీ మన సౌకర్యాలు పెంచుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి తిండి సంపాదించుకునే శక్తిని, అలాగే తనని తాను రక్షించుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. ఈ రెండే అవసరం ఏ జీవికైనా.

మంచు గారు, మీ వైపు ఏమో కానీ మా వైపు ఈ రైతుల పరిస్థితి కాస్త భిన్నం. వాళ్ళకొచ్చే ఆదాయంతో పోలిస్తే ఉద్యోగస్తుల కొచ్చే ఆదాయం తక్కువ అనిపిస్తుంది నాకు . :-)) సంవత్సరానికి వాళ్ళ ఖర్చులన్నీ పోగా 4 నుంచి 5 లక్షలు సేవింగ్స్ చేయగల్గుతున్నారంటే అది తక్కువ ఆదాయం అని నేననుకోను. మాది వ్యవసాయ కుటుంబం కాకపోయినా, ఇంటికెళ్ళి ఆ పొలాలు గట్రా చూసినప్పుడల్లా ఎప్పటికైనా ఓ రెండెకరాల పొలం కొనగలనా అనుకుంటుంటాను. :-). రైతులు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు పాటించడం మొదలుపెట్టిన తర్వాత బాగనే ఆదాయం గడిస్తున్నారు ఈ కాలంలో. :-))

Surabhi said...

Manchpallaki gaaru,
Thought provoking post. As well the comments too.
As every one said, I do respect Farmers and soldiers as well I feel every profession/job has its own value and dignity of labour should be devloped

మంచు said...

శ్రీనివాసు, మధురగారు, భానుగారు, రవిచంద్ర, కావ్య, అప్పు, శివా, నేస్తం గారు. వేణూ గారు, రాధిక గారు, కౌటిల్య గారు ...స్పందించినందుకు ధన్యావాదాలు

మంచు said...

లలితగారు... అవును మీ బజ్ చూసాకే రాసింది. మీ నాన్నగారికి, రాజుగారికి, మీకు జై జై లు.

తృష్ణ గారు... చాలా థాంక్స్ అండి ....

మంచు said...

శ్రావ్యగారు: ముందుగా స్పందించినందుకు ధన్యవాదాలు... ఇక విషయం లొకి వెళ్ళేముందు.... ఒక చిన్న కేస్ స్టడీ చూద్దాం.

౧) దీంట్లో మీరు నేలకొ ప్రాజెక్ట్ చేసి మేనేమెంట్ కి సమర్పిస్తూ ఉండాలి అనుకుందాం... బాగా కస్టపడి మొత్తం కొడింగ్ చేసారు... అయితే నేలాకర్న మీ కంప్యూటర్ క్రాష్ అయ్యి మొత్తం మీ ప్రొగ్రాం అంతా పొయింది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది... కస్టం అంతా నేలపాలు అయిపొయింది అనుకుని బాధపడతారా... ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యనందుకు మీకు ఆ నెల జీతం ఇవ్వలేదు.... పైగా మీకు సంబంధం లేకపోయినా క్రాష్ అయిపొయిన కంప్యూటర్ కూడా మీరే బాగుచేయించుకొవాలి అన్నారనుకొండి...మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఇదే సంఘటన మీకు తరచుగా జరుగుతుంది అనుకొండి మీ పరిస్తితి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని భాద్యతలు ఉన్నాయో తెలీదు కానీ ఒకవేళ పెళ్ళికెదిగిన కూతుర్లు, అప్పులు ఉండి ..అప్పుడు కూడా ఇదే పరిస్తితి ఎదురయితే... జస్ట్ ఇమేజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్...ఆ ఉద్యోగం ఎన్నిరోజులు చెయ్యగలరు....

౨) ఇప్పుడు మీకు ఆ సమస్యలు ఎమీ లేవు కానీ మీ అఫీసులొనే ఒకతనిని ఇలానే ఉంది... అతను మీ కంపెనీకు చాలా ఇంపార్టంట్ వ్యక్తి.... గత ఇరవై సంవత్సరాలుగా ఇలా తరుచూ కంప్యూటర్స్ క్రాష్ అవుతున్నా...జీతం రాకపోయినా . అదే ఉద్యొగం ఒపికగా చేసున్నాడు అనుకొండి... అప్పుడు మీకు ఏమనిపిస్తుంది... ఇప్పుడు అదే వ్యక్తికి బయట మంచి ఉద్యొగం ఉంది... అయినా వెళ్ళడం లేదు... ఎన్ని ప్రాబ్లంస్ ఉన్నా ఇక్కడే ఉన్నాడు... అప్పుడు అతన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ... అయితే అతను పిచ్చి వాడు...లేక ...ఈ కంపెని అంటే విపరీతమయిన పేమ , విశ్వాసం ఉన్నవాడు...

ఇప్పుడు అతను వెళ్ళిపొతే మీ కంపెనీ కస్టాల్లొ పడుతుంది తెలుసు మీకు... అతని కస్టాలు మీకు తెలుసు...అయిన వదిలి వెళ్ళడం లేదు అని తెలుసు ...అందువల్ల మీకు మీ కంపెనీకి కలిసొస్తుంది తెలుసు .. ... ఇప్పుడు...మీరు మీ కంపెనీలొ మిగతా వారి కన్నా అతనికి కాస్త ఎక్కువ గౌరవం ఇవ్వడానికి వెనకాడతారా... లేక నేను కూడా కస్టపడి నిజాయితీగా చేస్తున్న కనుక అతని త్యాగాన్ని ( లేక చేతకనితనాన్ని ) అంత పట్టించుకొనవసరం లేదు అనుకుంటారా....

ఇప్పుడు ఇక్కడ కంపెనీ = మన సమాజం... ఆ ఎంప్లాయీ = రైతు... కంప్యూటర్ క్రాష్ = ప్రకృతి వైపరిత్యం, కొత్త కంప్యూటర్ కొనడానికి డబ్బు = తర్వాతి పంటకి పెట్టుబడి... జీతం = పొలం మీద వచ్చే రాబడి... అని నా ఉదాహరణ...

మంచు said...

డాక్టర్ , డ్రైవర్, విమానం పైలెట్...ఇలా చాలా మంది ముఖ్యమయిన ఉద్యొగాల్లొ ఉన్నారు. అవును రిస్క్ తగ్గ జీతమూ తీసుకుంటారు... మీరు చెప్పిన ఉద్యొగాల్లొ జీవన ప్రమాణాలన్నీ చాలా వరకు మీ వ్యక్తిగత నైపుణ్యత , మీరు తీసుకునే నిర్ణయాలమీద అధారపడి ఉంటాయి... కానీ ఇక్కడ ప్రకృతి అన్న థర్డ్ ఫ్యాక్టర్ మీ సక్సస్ ని కంట్రొల్ చేస్తుంటే అప్పుడు ఆ నిస్సహాయత మాటల్లొ చెప్పలేనిది... ఎంత అంటే కుటుంబాన్ని కూడా వదులుకుని ఆత్మహత్య చేసుకునేటంత....

కళ్ళముందు పచ్చటి చేను ఎండిపొతుంటే ...ఎమీ చెయ్యలేక.... కన్న బిడ్డను కొల్పొతున్నంత బాధను.. కళ్ళల్లొ కనబడనీకుండా చేను గట్టున కూర్చుని నిస్సహాయంగా చుస్తూ కూర్చునే రైతు కళ్ళలొ ఒకసారి చూస్తే ...కొంచెం కరగక మానదు...

ఆ వృత్తి నైనా నిబద్దత తో చేసే వ్యక్తీ గౌరవనీయుడు , అతని వల్ల ఆ వృత్తికి గౌరవం వస్తుంది>>> అవును... ఇప్పుడు ఇంకొ వ్యక్తి నిబద్దత తొ పాటు కాస్త త్యాగము ఉందనుకొండి .. అప్పుడు ఇంకొంచెం గౌరవం వస్తుందా....

నేను రైతు , జవాన్ చేస్తున్నది గొప్పది అంటే మీరు నేను చేస్తున్నది ఇంతేనా అని కాదు... నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ..ఈ స్తాయి రావడానికి ఎంత కస్టపడ్డానొ నాకు తెలుసు కదా... కస్టం లేదని ఎలా అనుకొగలను... అసలా మాట నేను ఎక్కడా వాడలేదు. గమనించండి...

మంచు said...

మందాకిని గారు... చాలా ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజం...

మీరు కనిపెట్టాలి అన్నారు కదా అలాంటివి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నా.. మిగతావారి కోసం

ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాభావం ఉండొచ్చు...ఈ పంటలు వెయ్యండి... లేక తుఫాన్ హెచ్చరిక .... మీరు కొసిన పంట ముందే బద్రపరచుకొండి అని వింటూ ఉంటాం... ఈ ప్రకృతి గురించి కొంతలొ కొంత ముందే ఎలా ఊహిస్తున్నాం... దానికి కావాల్సినది కేవలం వాతావరణ శాస్త్రమే కాదు అంత అనాలసిస్ చెయ్యడానికి సూపర్ కంప్యూటర్స్ ఉండాలి... శాటిలైట్లు ఉండాలి...మోస్ట్ అఫ్ఫీషియంట్ అల్గారిదంస్ రన్ అవ్వాలి..... ఇవన్నీ ఎక్కడివి...ఈ ఎలెక్ట్రాన్స్ ఇంజనీరువే కదా... ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రూపొందించినవే కదా... ఇప్పుడు రేపు ఎవరన్నా మరింత సమర్ధవంతం గా పనిచేసే మేఘమధనం చేసే కొత్త టెక్నిక్ కనిపెడితే అతను రైతులకి హీరొ ..

అలానే జవాన్లకు ఉపయొగపడే బొల్డు రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్త...అన్నీ ఈ ఎలెక్ట్రానిక్స్ తొ కూడకున్నవే....

Sravya V said...

మంచు గారు కొద్ది గా ఉదాహరణ ని మారుద్దాం , ఇక్కడ నన్ను మీరు కంపేర్ చేయాలిసింది రైతుతో కాదు కూలీ తో . నాకు తెలిసినంత వరకు ఒక నెల రోజుల తరవాత నేను చేసినదంతంతా కంప్యూటర్ క్రాష్ అయ్యి పోయిందనుకోండి మొదటి సారి ఊరుకున్తారేమో గాని రెండోసారి ణా చేతిలో పింక్ స్లిప్ ఉంటుంది . ఆ రోజుతో ణా బతుకు రోడ్డున పడుతుంది . ఇక ణా భాద్యతల సంగతి పక్కన పెడితే సవింగ్స్ లేకపోతె తరవాతి నెల నుంచి ఫుడ్ ఉండదు సరికదా రైతుకు పంట నాశనం ఐనప్పుడు దొరికే సానుభూతి కూడా ఉండదు . అలాగే చిన్న పరిశ్రమలు పెట్టి కక్క లేక మింగ లేక బాధ పడుతున్న వాళ్ళని బోలెడు మంది ని చూసాను .

అలాగే ఇంకొక ఉదాహరణ చెబుతాను నేను ఒక ఒక జంట తమ శాయశక్తులా కస్టపడి తమ బిడ్డ ని చదివించి పెద్ద ఉదోగస్తుడిని చేయాలనుకున్నారు వాళ్ళు సంపాదించిన దంతా ఆ బిడ్డమీద కర్చు పెట్టారు , వేరే జంట వాళ్ళు సంపాచించిన దంతా ఒక ఎకరం పొలం కొని , దాని మీద పెట్టుబడి పెట్టారు . ఏదో ఆరోగ్య కారణాల వాళ్ళ మొదటి జంట బిడ్డకి (ఎప్పటికి ) ఉద్యోగం చేయలేని పరిస్తితి , ప్రకృతి అనుకూలించక రొండో జంట కి ఒక సంవత్సరం (లేదూ రెండు. మూడు ఏళ్ళు ). ఇక్కడ ఎవరికీ జరిగిన నష్టం ఎక్కువ ? దీని వల్లే మన వాళ్ళలో స్తిర చర ఆస్తుల మీద అంత మోజు .

ఇక పైన చెప్పిన చాల మంది అబిప్రాయాల ప్రకారం ఉద్యోగస్తుల లకి కస్టాలు లేనట్టు ఉన్నాయి , నిజం గా అది నిజామా అనిపిస్తుంది ? రైతు కి ప్రకుతి ఎంత అనుకూలించాలో , ఇక్కడ ఉద్యోగస్తుడికి ప్రపంచ పరిస్తితులు అనుకూలించాలి. . ఒక్క సారి రేసిషన్ నాటి పరిస్తితులు గుర్తుతెచ్చుకోండి .

ఇక మీ బజ్ఓ చూస్తె ఇక్కడ మీరు మంచి పోస్టు రాస్తే నేను నా కామెంట్ల తో అనవసర వాదన చేస్తున్న అన్న అభిప్రాయం ఉన్నట్లు ఉంది , అందుకే ఇక ఈ విషయం మీద నేను స్పందించా బోను . చివరి గా ఒక రైతు ని , బస్సు డ్రైవర్ తో పోల్చినందుకు బాధ పడుతున్న వారికి నేను అది మంచి ఉద్దేశ్యం తోనే రాసాను , నా దృష్టిలో ఇద్దరూ గొప్పే ఒకవేళ అది భాద కలిగిస్తే నన్ను క్షమించండి .

Ennela said...

ముసురు పడితే పకోడీలు తిందామా , బిరియాని చేసుకుందామా అని మిగతా ప్రపంచం అంతా ఆలోచిస్తున్న టైం లో పంట ఏమైపోతుందా అన్న టెన్షన్...
This is true...good post

మంచు said...

చీకటిగారు :
ఇది మీ కామెంట్ :
>>ఎదో ఒక జాబ్ సంపాదించుకొని సొంత కాల్ల మీద నిలబడాలనే తాపత్రయంతోనే ఎక్కువ మంది వెల్తారు తప్ప, దేశరక్షణ లాంటి పెద్ద పెద్ద పదాలు వారికి తెలీవు.
--------------------------

పొనీఎ ఆ ఉద్యొగం లొ వాళ్ల ప్రాణాలు పొవచ్చు అని వారికి తెలుసా అప్పుడు... అదీ తెలీదంటారా... తెలిసి ఎందుకు వెళ్ళి ఉంటారు.... తెలీక వెళ్ళిన వాళ్ళు రాకుండా ఎందుకు ఉండి పొయినుంటారు... మిలట్రీ అంటే కేవలం ఇంటర్మీడియెట్ అర్హత లొ చెసే ఉద్యోగం కాదు... అందులొ ఎందరొ డాక్టర్లు ఉంటారు... ఇంజనీర్లు ఉంటారు.. మనకంటే తెలివయిన నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు ప్రత్యక్షం గా యుద్దం లొ పాల్గొనకపొయినా , చావు అత్యంత దగ్గరగా పనిచేస్తారు. ఇక మనకి తెలుసున్నది... ఎదొ ఒక ఉద్యొగం... ఉత్తర బారత దేశం లొని గ్రామాల్లొ సైన్యం లొ పనిచెయ్యడం ఒక గౌరవం... తండ్రినుండి కొడుకు కూతురు లకు వచ్చే వారసత్వం... ఒక పేషన్... మెడల్స్ కొసం కస్టించడం.. అదొ ప్రపంచం...

మనలొ ఎంతమంది చావుకు తెగించి పనిచెయ్యగలరు... అంత రిస్క్ తీసుకొవడానికి ఏమాత్రం ఆశిస్తాం మనం?

మంచు said...

శ్రావ్యగారు:
చూసారా... ఒక్క పింక్ స్లిప్ కి మీరు సానుభూతి ఆశిస్తున్నారు... మరి ఈ రైతు జీవితం లొ ఎన్ని పింక్ స్లిప్పులు తీసుకుని ఉంటాడు... ఈ రెసెషన్ గత యాబై ఎళ్ళలొ ఒకసారి మనకి వచ్చిన కస్టం... రైతుకి ప్రతీసంవత్సరం టెన్షన్..ఎప్పుడు రెసెషన్ వస్తుందా అని... రెసెషన్ టైం లొ మన ఉద్యొగం ఊడుతుందేమో అని డవుట్ వచ్చినప్పుడు ఇంకాస్త మంచి స్టాండర్డ్ ఉద్యొగం వస్తే వెంటనే దూకేయ్యం మరి.... ఈ రైతు అలా దూకడం లేదు ..ఎందుకంటారు ?

మంచు said...

ఆకాశరామన్న : మీ ఈ కామెంట్ తొ విభేదించే అంశాలు చాలా ఉన్నాయి (మీతొ కాదు సుమా :-) )
సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు... టీచర్, పూజారి, ట్రాఫిక్ పొలీసు...ఇలా చాలా వృత్తులకీ తప్పడం లేదు సినిమాల్లొ ... మీరు సాఫ్ట్వేర్ లొ ఉన్నందువల్ల అది ఎక్కువగ కనిపిస్తుంది (అనిపిస్తుంది)... ప్లస్ సమాజానికి ఈ సాఫ్ట్వేర్ ఒక లేటెస్ట్ & హాట్ టాపిక్ కాబట్టి సహజం గానే ఫొకస్ దానిమీద ఉంటుంది... పొలీసు హీరొ గా చూపించే సినిమాలు ఎడాదికి మూడు వస్తే ..మూడువందల సినిమాల్లొ పొలీసు అంటేనే అవినీతికి మారురూపంగా చూపిస్తారు. కదంటారా...

ఇక అన్నదాత ... ఇదేం భావజలం నుండి వచ్చిందొ కానీ... తనకి నస్టం వచ్చినా చేసే వ్యక్తిని దాత అనే అంటారు అని నా నమ్మకం... ఇక్కడ ఖచ్చితం గా నస్టమే వస్తుంది. కాదని చెప్పకండి... నేను చెప్పిన లెక్కలు మా పొలానికి వచ్చేవే....

ఇక గ్లామర్... మనం రంగం లొకి దిగితేనే కానీ తెలీదు బాస్... కస్టనస్టాలు... సరిహద్దులొ ఎటువైపునుండి తూటా దూసుకువస్తుందొ తెలీకుండా ఎముకలు కొరికే చలిలొ రొట్టెముక్కలు తింటూ చేసే ఉద్యోగం, ఇంటిదగ్గర ఫ్యామిలితొ ఉంటూ సెవెన్ సీటర్ నడిపే ఉద్యోగం కంపేర్ చేసి చూస్తే... కాదు ... మనం చేసి చూస్తే అప్పుడు ఎది ఎంచుకుంటామో మరి...

జాలి పడే విషయం వేరు .... గౌరవం చూపాల్సిన విషయం వేరు... మీ అలొచనా విధానం లొ నా అలొచన విధానం లొ అక్కడ కామన్ విషయం లేదు.. రిక్షా తొక్కుకునే అతనికి ఆటొ ఇస్తే ఇంకా రిక్షా తొక్కుతాడా... అతను ఇంకా అలా తొక్కితే మనకి ఎమన్నా ఉపయోగమా...

మీరు నాకేదొ సాఫ్ట్వేర్ ఉద్యొగులు అంటే ఎదో చిన్న చూపు ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు.... :-) అదేం కాదు.. ఉదాహరణకి... సాఫ్ట్వేర్ ఉద్యొగులు వాతవరణ కాలుష్యం ఎలా తగ్గిస్తారు అని అప్పుడప్పుడూ ఇలా వాదిస్తూ ఉంటాను... సెల్‌ఫొన్ తొ రిజర్వేషన్ చేయించుకొగలిగే సాఫ్ట్వేర్ కనిపెట్టారు కదా... దీనివల్ల చాలా మంది వినియొగదారుడికి కలిగే సౌకర్యం, శ్రమ తగ్గడం చూస్తారు.. కానీ నేను... అందువల్ల ఆ వినియోగదారుడు రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్ళక్కర్లేదు... అంటే ఆటొనొ, బండొ ఉపయొగించడం సేవ్ అయ్యింది... అంటే కొంత కాలుష్యం తగ్గింది అని.. ఇలా ఏటా ఒక కొటి మంది ఈ సావ్ట్వేర్ ఉపయొగిస్తే ఎంత పెట్రొల్ ఆదా... ఎంత కాలుష్యం తగ్గుతుంది...ఇది నేను అలొచించే విధానం... ఎవర్ని తక్కువ చెసే ఉద్దేస్యం లేదు... కొందర్ని పొగడాలంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదు ... అన్నట్టు నేను సాఫ్ట్వేర్ ఉద్యొగస్తుడిని కాదు :-)

Sravya V said...

ముందు గా మాట తప్పినందుకు క్షమించండి .
రేసిషన్ ఈ 50 సంవత్సరాలలో ఒకటా ? మరి అంతకు ముందు పేలిన డాట్ కం బబుల్ సంగతి , ఆర్ధిక మాంద్యం సంగతి ? రైతుకి పంట చేతికి వచ్చేది దాక ఎంత కష్టమో ఒక మామూలు (ఇక్కడ చాల మంది మంచి MNC ల సంగతే చూస్తున్నారేమో ) కంపెనీ లో పని చేసే ఉద్యోగి కి కూడా అంతే కష్టం ఉంటుంది . మారిన టెక్నాలజీ కి అనుగుణం గా సర్దుకు పోవటం , లేదా మారిన కంపనీ పాలసీ లకు అనుగుణం గా సర్దుకు పోవటం అనేది కూడా రిస్కే . ఇక పింక్ స్లిప్ కి సానుభూతి అవును నా శ్రమ తో tax కట్టి , ఎంతో కొంత ఆర్దికాభివ్రుద్దికి సహాయపడుతుంటే కనీసం లిప్ సింపతి కోరుకోవటం లో తప్పు లేదేమో .
PS : ఇక్కడ నేనేదో రైతులకి , వ్యవసాయానికి వ్యతిరేకం కాదు నేను అలాంటి కుటుంబం లోంచి వచ్చినదాన్నే .ఒక రొండు 2 సంవత్సరాల క్రిత్రం నేను మా అమ్మమ్మ గారికి ఇంటికి వెళ్ళినప్పుడు సగానికి , సగ, మంది అడిగిన ప్రశ్న ఇది "పాప ఇక సాఫ్ట్వేర్ పరిస్తితి ఇపోయినట్లే అంటగా మళ్ళీ వెళ్తునావా ఇక్కడే ఉంటావా ?" దీనికి ఒక్క క్షణం ఫీలయినా దాన్ని తప్పు కో తీసుకోలేదు . ఇది వేరే ఉద్యోగాలకి దొరికే మీరు చెప్పే గౌరవం . మీరు చెప్పేటట్లు గా ఎవరూ చేసే పనిని బట్టి గౌరవం ఇవ్వడం లేదు లేదా శ్రమ కి ఇవ్వడం లేదు . ఎంత డబ్బు సంపాదించారా అనేది ముఖ్యం అది ఎలా ఐనా సరే నేను చెప్పేది రూడ్ గా ఉన్న జరుగుతుంది ఇదే .

మంచు said...

మౌళిగారు.. పైన నా కామెంట్లు చదవగలరు. ధన్యవాదాలు
వేణూరాం, 3జి , కిరణ్ : థాంక్ యూ :-)
వజ్రం గారు... 100%... మీరు చెప్పిందే నేను చెప్పాలనుకునేది.. మీరు మరింత బాగ చెప్పగలిగారు ... ధన్యవాదాలు.
ఇందూ గారు : అవునండీ... ఇదే నేను చెప్పాలనుకున్నది... మీరు మంచి వ్యాఖ్యాల్లొ పెట్టారు ... చాలా థాంక్స్ మేం :-)
కృష్ణ గారు: ఒక సమస్య కి మనిద్దరం ఒకే విధం గా స్పందిస్తాం కానీ ... దానికి సొల్యుషన్ అలొచించడం లొ మాత్రం మనిద్దరి అలొచనలకి పొంతన కుదరదు :-) ఇలాగే కానిచ్చేద్దం మరి :-)
రాజు గారు.... మీరు రాసే కధలు అంతగా నచ్చడానికి ముఖ్య కారణం ఇదే కదా...
సునీతగారు, హరే... ధన్యవాదాలు... సునీతగారు మీకు ఒక జై ...

మంచు said...

నాగా... నీ మొదటి పేరా... ఒకే...
ఇక ఈ నాలుగైదు లక్షలు ... ఎన్ని ఎకరాలకి ... డ్రిప్ ఇరిగేషన్ కి ఎంత పెట్టుబడి.... పొలం విలువ ఎంత... ఇవన్నీ పొనీ ... రైతు ఉద్యొగం బాగుంతే... మీ అనంతపురం జిల్లాలొనే ఎందుకు ఎక్కువ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?
అంత లాభదాయకం గా ఉంటే చెప్పు బాస్.. నేనే కొనుక్కుంటా... ఈ ఫ్లాట్లు, అపార్ట్మెంట్స్ ఎందుకు....

నాగా... నీ మొదటి పేరా... ఒకే...
ఇక ఈ నాలుగైదు లక్షలు ... ఎన్ని ఎకరాలకి ... డ్రిప్ ఇరిగేషన్ కి ఎంత పెట్టుబడి.... పొలం విలువ ఎంత... ఇవన్నీ పొనీ ... రైతు ఉద్యొగం బాగుంతే... మీ అనంతపురం జిల్లాలొనే ఎందుకు ఎక్కువ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?
అంత లాభదాయకం గా ఉంటే చెప్పు బాస్.. నేనే కొనుక్కుంటా... ఈ ఫ్లాట్లు, అపార్ట్మెంట్స్ ఎందుకు....

సురభి గారు, ఎన్నెల గారు : ధన్యవాదాలు ...

Mauli said...

మ౦చు గారు,

నా కామె౦ట్ చదివారా అసలు ,

ధన్యవాదములు

Bhardwaj Velamakanni said...

Good one dude

Anonymous said...

చాలా బాగుందండి. నేను ఈ మధ్య కాలంలో చదివిన ఒక అద్బుతమయిన టపా.
నేను రైతునే(తరువాతే సాఫ్ట్వేర్ ఇంజనీర్) .శ్రావ్య గారి కామెంటుతో నేను ఏకీభవిస్తాను.అన్ని వృత్తులు సమానమే అండి.
కీప్ రైటింగ్ సర్.

Anonymous said...

ఈ ప్రపంచంలో అతి కష్టమయిన ఉద్యోగం "హైదరాబాద్ లో సిటి బస్సు డ్రైవర్ ఉద్యోగం అండి"

కత పవన్ said...

శ్రావ్య గారి కామెంటుతో నేను ఏకీభవిస్తాను.అన్ని వృత్తులు సమానమే అండి.
-------------
అప్పి నీ కామెంట్ తో నేను ఏకిభవించను. ఎందుకంటె అన్ని వృత్తులు సామానం కావు కాలేవు ... వ్యబిచారం, దోంగతనం , దాదాగిరి చేసే వాళ్ళ కు అవి వృత్తులే కాని ఇతరులకు నష్టం అలాంటప్పుడు సమానం ఎలా అవుతాయి .. ఇక మిగిలిన వృత్తులు (సాప్ట్ వేర్ , డ్రైవర్ ) లాంటివి స్వంత లాభం కోసం చేస్తారు ఒక్కవేళ ఉపయొగం ఉన్నా కొందరికి మాత్రం కాని మంచు గారు చెప్పి నట్టు రైతు, సైనికుడు కి మించిన వృత్తి లేదు .. రైతు తన కడుపు నింపు కుంటు పది మంది కడుపు నింపుతాడు సైనికుడును తను కష్టపడి దేశప్రజలందరికి అందరికి రక్షణ గా నిలుస్తాడు సో అన్ని వుత్తులలో ఇవి రెండె గొప్పవి కాదనగలవా

నాగప్రసాద్ said...

ఎన్ని ఎకరాలకి?

నాలుగు ఎకరాలకు అనుకుందాం. ఇక్కడ ఎకరా సంబంధం కాదు. ఎన్ని చెట్లు అన్నది సంబంధం. ఉదాహరణకు మనకు 200 చెట్లు ఉన్నాయనుకోండి, మార్కెట్ బాగుంటే రెండు లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొన్ని సార్లు అటు ఇటుగా ఆదాయం వస్తుంటుంది.

ఇక మా జిల్లాలో ఆత్మహత్యల సంగతి కొస్తే, మా మండలంలో నాకు తెలిసి ఇంతవరకు ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోలేదు.

అనంతపురం జిల్లాలో రెండు రకాల నేలలు ఉంటాయి. ఒకటి ఎర్ర రేగడి, రెండు నల్ల రేగడి. ఎర్ర రేగడి నేలలు ఉన్నవాళ్ళకు సమస్య ఉంటుంది. మా వైపు నల్ల రేగడి కాబట్టి అంత సమస్య లేదు.

కానీ, ఒకటి చెబుతాను. మిగతా అన్ని వృత్తుల్లో రాను రానూ వనరులు తగ్గిపోతుంటాయి. కానీ, వ్యవసాయంలో అలా కాదు. ఒక విత్తనం వేస్తే పది కాయలు వస్తాయి.

నాగప్రసాద్ said...

చెప్పడం మరిచా...నేను చెప్పేది పండ్ల తోటల గురించి. వరి లేదా ఇతర పంటల విషయంలో లాభ, నష్టాలు వేరుగా ఉండొచ్చు.

Anonymous said...

/ హాయిగా పొలం అమ్మేసి దర్జాగ చీకు చింతా లేకుండా వడ్డీ తింటూ బ్రతక్క.... /
అమ్మేసి బేంక్ లో వేసుకుంటే వడ్డీ 8% వస్తుంది, తగ్గవచ్చు కూడా. మరి అప్రిషిఏషన్ మాటేమిటి అని మిమ్మల్ని ఎదురు ప్రశినించకపోయినా, ఆ రైతుకు తెలుసు. అందుకే మీ సీరియస్ సలహా పట్టించుకోలేదని నా అనుమానం. :P :))

మంచు said...

నాగా... మాకు ఎకరా మీకు చెట్లు...
ఒకే మాకు పది ఎకరాలుంటే ఎడాదికి మూడు లక్షల ఆదాయం.... ఒక మంచి ప్రబుత్వ ఉద్యొగస్తుండి జీతం అనుకుందాం. అదే ఎకరాలు అమ్మి పాడేసి బ్యాంక్లొ వేసుకుంటే ఎడాదికి ఏడునుండి ఎనిమిది లక్షలు అదాయం.... ఇప్పుడు ఏది బెస్ట్ అంటావ్...ఇదే లెక్క నేను పొస్ట్ లొ రాసింది. అయితే పది ఎకరాలు పంటభూమి ఉన్నా అసాలు చాలా తక్కువ బాబు... ఒకవేళ ఉన్నా నస్టానికే పనిచేస్తున్నాడు.


ఇక మిగతా అన్ని వృత్తుల్లో రాను రానూ వనరులు తగ్గిపోతుంటాయి. కానీ, వ్యవసాయంలో అలా కాదు. ఒక విత్తనం వేస్తే పది కాయలు వస్తాయి. ..నువ్వు చెప్పేది ఈ వృత్తొ తెలీదు... పాయింట్ అయితే......
విత్తనం వేసి, ఆకుమడి చేసి, దుక్కు దున్ని, చేను ఊడ్చి , నీళ్ళు పట్టి, ఎరువులు వేసి, పురుగుమందులు వేసి, కొతకోసి, కుప్పనూర్చి, కొలత పెట్టి, బస్తా ఎక్కించి, మిల్ల్ కి తొలేవరకూ చేతిలొకి చిల్లి గవ్వరాదు. ఈ స్టెప్లు అన్నిటిలొనూ రిస్క్ ఉంది. నకీ విత్తనాల దగ్గరనుండి... మన దాన్యం కొనే దళారివరకు... అతి వృస్టినుండీ...అనావృస్టివరకూ...
విత్తనం వేస్తే అది పది కాయలు ఇస్తుంది అనేంత ఈజీ కాదు :-)
ఇక నీకు తెలియని మీ జిలా రైతు ఆత్మహత్యల గురించి తెలియాలంటే ఈ లింక్ చూడు... గూగిల్ లొ కొడితే మొదటి లింక్....అలాగే ఈ లింక్ లొ కారణాలు కూడా చూడు... ఒక విత్తనం వేస్తే ఎంత ఈజీ గా పంటపండిచ వచ్చొ కూడా ఒక ఉదాహరణ ఉంది

http://www.hinduonnet.com/businessline/2002/12/09/stories/2002120900631300.htm

కొంచెం ఒపిగ్గా చూస్తే ఇంకా దొరకొచ్చు

Anonymous said...

/ వుత్తులలో ఇవి రెండె గొప్పవి కాదనగలవా /
అనగలను. :)
రైతు తన కోసం పండించుకుంటాడు, ఎక్కువరేటు వచ్చినచోట అమ్ముకోవాలనుకుంటాడు, దేశాన్ని ఉద్ధరించాలని కాదేమో. సైనికుడు ఓ ఉద్యోగి, వాలంటీర్ కాదు. టీచర్, డాక్టర్లది పవిత్రమైన వృత్తి అనేవారు, ఇప్పుడలాంటి అపోహల్లేవు. సో, గౌరవంగా, సక్రమంగా చేయగలిగితే అన్ని వృత్తులూ గొప్పవే.

మంచు said...

శంకర్ గారు... అప్రిషిఏషన్ అనే మాట కడుపునిండిన వాడికి (అంటే నాలాంటి వాడికి ) వచ్చే అలొచన... రొజు గడవని రైతుకి రాదు. మన దేశం లొ ...

అలాగే నేను సలహాలిచ్చిన వారు కూడా... అంతా బాగుండి నాలుగు వేళ్ళు నొటిలొకి వెళ్తే...ఉన్న ఆస్తులు అమ్ముకొమని నేను చెప్పనూ...చెప్పినా వాళ్ళూ వినరూ...

అమ్ముకొలేని పరిస్తితిలొ ఉన్నప్పుడు... చేతిలొ కొహినీర్ వజం ఉన్నా...గులకరాయి ఉన్నా ఒకటే కదా.... ఏది కూడు పెట్టదు... బ్రతకడానికి వేరే ఉపాది చూసుకొవల్సిందే...

మంచు said...

ఎక్కువరేటు వచ్చినచోట అమ్ముకోవాలనుకుంటాడు... అలా అంటే పొలాన్నే అమ్మేసుకుంటే ఇకా ఎక్కువ వస్తుంది అండీ... పైన లెక్క చూడండి... పైన నేను చెప్పింది బ్యాంక్ లెక్కా... అదే... అతను అమ్మేసి బ్యాంక్ లొ వేసి వేరే ఉద్యొగమూ చూసుకొవచ్చు... అప్పుడు ఇంకా ఎక్కువ లాభం....

మీరు అనుకున్నంత స్వార్ధం రైతుల్లొ చాలా తక్కువ....

ఇక సైనికుడుని కేవలం ఒక ఉద్యొగిగా ప్రపంచంలొ ఏ దేశం లొ ఏ కల్చర్ లొ చూడరు... ఎక్కడయినా ఒక హీరొ లానే చూస్తారు. జవాన్ల పట్ల మీకు అలాంటి అభిప్రాయం ఉండటం నిజంగా దురదృస్టకరం... ఇక నేనేమి చెప్పలేను

మంచు said...

ఎక్కువరేటు వచ్చినచోట అమ్ముకోవాలనుకుంటాడు... అలా అంటే పొలాన్నే అమ్మేసుకుంటే ఇకా ఎక్కువ వస్తుంది అండీ... పైన లెక్క చూడండి... పైన నేను చెప్పింది బ్యాంక్ లెక్కా... అదే... అతను అమ్మేసి బ్యాంక్ లొ వేసి వేరే ఉద్యొగమూ చూసుకొవచ్చు... అప్పుడు ఇంకా ఎక్కువ లాభం....

మీరు అనుకున్నంత స్వార్ధం రైతుల్లొ చాలా తక్కువ....

ఇక సైనికుడుని కేవలం ఒక ఉద్యొగిగా ప్రపంచంలొ ఏ దేశం లొ ఏ కల్చర్ లొ చూడరు... ఎక్కడయినా ఒక హీరొ లానే చూస్తారు. జవాన్ల పట్ల మీకు అలాంటి అభిప్రాయం ఉండటం నిజంగా దురదృస్టకరం... ఇక నేనేమి చెప్పలేను

Anonymous said...

@శ్రావ్య, సాఫ్ట్ వేర్ లో పని చేసే వారి కష్టాలను రైతుల కష్టాల తో పోల్చలేము. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం లో ఉండే నిరంతర మార్పుల గురించి ఆ రంగం లో ఉన్నవారికి ఎరుక ఎక్కువగా ఉంట్టుంది. కనుకనే వారు అప్ డేట్ చేసుకొంట్టూ ఉంటారు. ఇక భార్యా భర్తలు ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒకరికి ఉద్యోగం పొయినా ఇంకొకరు పని చేస్తూ ఉండటం వలన కుటుంబం మీద తక్కువ ప్రభావం పడుతుంది. అదే రైతు విషయానికి వస్తే గాట్ లాంటి అంతర్జాతీయ వొప్పందాల గురించి ఎంద మందికి తెలుసు? ప్రభుత్వం కంపేనీలతో పలు రకాల వొప్పందాలు కుదుర్చుకొని మెల్ల గా అమలు లోకి తెస్తుంది. ఈ వొప్పందాలలో చాలా మటుకు రైతుకి లాభం కన్నా నష్టమేక్కువ గా ఉంట్టుంది, కనుక ప్రభుత్వాలు వీటీ వలన కలిగే పర్యవసానాలు తెలియనట్లు గమ్ముగా ఉంటాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మొదలు పెట్టిన తరువాత ఎదో వారికి సహాయం చేస్తున్నట్లు నటిస్తాయి.
----------------------------------
ఆంధ్రా వరకు తీసుకొంటె ఒకప్పుడు రాజకీయా లను ప్రభావితం చేసిన నాయకులు పల్లెల నుంచి వచ్చారు. ఇప్పుడు వారి వారసులు రాజకీయాలను కొన సాగిస్తున్నా వారికి పల్లెల తో సంభందాలు చాలా తక్కువ. వారంత పట్టణాలలో పెరగటం, చుట్టపు చూపుగా పల్లేల కి వెళ్ళి వస్తున్నారు. రైతుల సమస్యలను హృదయం తో అవగాహన చేసుకొనే వారు కరువైయ్యారు. పైపైన తాత్కాలిక చర్యలు తీసుకోవటం మాత్రమే జరుగుతున్నాది. మా ఊరి వరకే తీసుకొంటె 20 సం|| క్రితం కొంతమంది రెడ్లకి 50-70 ఎకరాలు ఉండేవి, అప్పట్లోనే వీరి పిల్లలు రియల్ వ్యాపారం లో దిగి సిటిలకి వెళ్ళి పోయారు. పొలం చూసుకొనే వారు లేరు. మెల్లగా వీరంతా వారికి ఉన్న పోలాన్ని ఊరిలోని కొంత మందికి అమ్మి వేసి సిటిలు చేరారు. ఈ పెద్ద రైతులు ఉన్న పుడు రాజకీయ నాయకులని ప్రభావితం చేయగలిగేవారు. ఇప్పుడు పెద్ద రైతుల సంఖయం పెద్దగా లేదు, చిన్న రైతులు వివిధ కారణాల వలన రాజకీయ నాయకుల మీద వారి సమస్యల పై వత్తిడి తేలేక పోతున్నారు.
-----------------------------------
ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది అంటె చాలా మంది మళ్ళీ పోలలని కొనటానికి ముందుకు వస్తున్నారు. కాని అది వ్యవసాయం మీద ప్రేమతో కాదు, పెట్టుబడి లో భాగం గా మాత్రమే. వారికి రైతుల సమస్యలు పట్టవు. గత 25 సం|| లలో రైతుల తరుపున గట్టిగా నిలబడే నాయకులు కరువయ్యారు. వారికి ఎవ్వరు చట్ట సభలలో లాబియింగ్ చేయటానికి లేరు. బలమైన వాయిస్ రైతులకు ఈ రోజులలో లేదు కనుక రానున్న రోజులలో వారి జీవితం లో పెద్ద మార్పు ఉండదు.
-----------------------------
అదే కాక సామజికం గా చూసుకొంటే ఈ మధ్య చదువుల పై పెరిగిన వ్యామోహం వలన వ్యవసాయం చేసుకొనే వారికి పిల్లని ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ఇక్కడ రైతు కుటుంబం దగ్గర ఉన్న డబ్బులు, ఆస్తులకన్నా చాలా మంది ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలు పెట్టారు.

Anonymous said...

/ఇక సైనికుడుని కేవలం ఒక ఉద్యొగిగా ప్రపంచంలొ ఏ దేశం లొ ఏ కల్చర్ లొ చూడరు... ఎక్కడయినా ఒక హీరొ లానే చూస్తారు./
అది 'సాంప్రదాయం ', ఓ 'ఎమోషనల్ ఫీలింగ్ ', వుండాల్సిందే, మంచిదే.

/ జవాన్ల పట్ల మీకు అలాంటి అభిప్రాయం ఉండటం నిజంగా దురదృస్టకరం... ఇక నేనేమి చెప్పలేను/
:) మీ అభిప్రాయాలు బాగా వున్నాయి, I agree with you in general, ముఖ్యంగా యుద్ధసమయాల్లో.
నేను చూసిన/విన్న కొన్ని సంఘటనలు అలా అనిపించాయి మరి. సాంప్రదాయంగా గురువు వృత్తి మాత్రమే అత్యుత్తమమైనది, జీతంకోసం పనిచేసినా పిల్లలకి పాఠాలు చెబుతారు, ఓ కొత్త తరానికి నాంది పలుకుతారు, కాబట్టి. That is a continuous process. డాక్టర్ రోగులకు మాత్రమే కొన్ని సమయాల్లో ప్రాణం పోస్తారు - only few get benefitted.

Anonymous said...

ఒక సారి ఇటో లుక్కేయండి..
రైతులూ, సైనికులూ, ఉద్యోగులలో .. ఎవరు గొప్ప?

Anonymous said...

ఇక్కడ చర్చ ప్రధానం గా రైతులు అంటె చిన్నా,సన్న కారు రైతులు సైనికులు అంటే సైనిక అధికారులు కాకుండా ఒక సాధారణ సైనికుడిని దృష్టీలో పెట్టుకొని మనం చర్చిస్తున్నాం అని నేనను కుంట్టున్నాను. అలాగే సాఫ్ ట్వేర్ కొస్తే ఒక ప్రోగ్రామర్, పి.యం. స్థాయి వారిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మనం చర్చిస్తున్నాం. ఈ కేటగిరిలో ఉన్న వారిని డబ్బు పరంగా,సామాజిక హోదా పరంగా, వారు అనుభవించే లైఫ్ స్టైల్ పరం గా చూస్తే అన్ని వృత్తులు సమానం అనే మాట వర్తించదు. ఒక సాధారణ సైనికుడి జీతం ఎంత? అతనికి కేరిర్ లో రీటైర్ అయ్యే నాటికి ఏ స్థాయి వరకు వేళ్ళగలడు? ఎంత సంపాదించగలడు మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలి. మరి అతనికి ఉన్న రిస్క్లు అతనికి ప్రభుత్వం ఇచ్చె సౌలభ్యాలు ఏ విధంగా ఉన్నాయి? నాకు తెలిసి వారు దేశం లో దాదాపు అన్ని ప్రాంతాలలోను పని చేస్తారు. పోవటానికి వారికి ఒక జనెరల్ కంపార్ట్ మెంట్ ల్ సీటుఇస్తారు. ఇక రిస్క్ విషయానికి వస్తె యుద్దం సమయం లో ప్రాణాలకు భరోసా లేదు. ఇప్పుడు వీరిని రాష్ట్రాలలో ఉన్న సమస్యలకు కూడా ఉపయోగిస్తున్నారు. వారి పని పెరిగిందే కాని తగ్గ లేదు.

అదే సాఫ్ట్ వేర్ రంగానికి వస్తే మొదటి ఉద్యోగం లోనే ఎన్నో రకాల బేనిఫిట్స్ ఇస్తారు. ఆ తరువాత కంపేని మారి నపుడల్లా ఎక్కువ డబ్బుకో, వివిధ రకాలైన బేనిఫిట్స్ కో మారుతాడు. వీరు ప్రణాలను పణ్ణం గా పెట్టి ఎమీ రిస్క్ తీసు కోవటం లేదు. ఇంటి కొరకు బాంక్ లో లోన్స్ తప్ప. చాలా మంది సాఫ్ట్ వేర్ వారు రిసెషన్ టైం లో ఎక్కువ గా బయపడేది ఇంటి లోన్ ఎలా తీర్చగలం అనే అంశం మీదే :-).

చదువరి said...

అన్ని వృత్తులూ గొప్పవే, దేని ప్రాముఖ్యత దానిదే - ఎవరూ కాదనరు. కానీ రైతుది ఒక ప్రత్యేకమైన పరిస్థితి.

రైతుది ఉద్యోగం కాదు, వ్యాపారం. కాబట్టి ఉద్యోగలకుండే ఆర్థిక భద్రత ఉండదు.

రైతు వ్యాపారం దైవాధీనం. వానలు కురిస్తే పంటలు పండుతాయ్. వానలు కురిసి, కురిసి.., కురిస్తే పంటలు మునుగుతాయ్. వానలు కురవకనే పోతే అసలే పండవ్. (మే వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద తలకాయలు మోరెత్తి మొయిళ్ళ వంక, వాతావరణజ్ఞుల వంకా చూస్తారు మరి.)

తీరా పంట చేతికొచ్చాక, అమ్ముకుందామంటే అది కొనేవాడి ఇష్టం. ఏ వ్యాపారస్తుడైనా తన వస్తువును తన రేటుకే అమ్ముకుంటాడు. డిమాండుకు అనుగుణంగా రేట్లు హెచ్చు తగ్గులు చేసుకున్నప్పటికీ, నష్టానికి మాత్రం అమ్మడు. డిమాండు ఉన్నప్పుడు తాను చెప్పినట్టు రేట్లను ఆడిస్తాడు. లేకపోతే వ్యాపారం మానిపారేస్తాడు. డబ్బులొస్తున్నంతవరకే వస్తువు మీద గౌరవం. రాని రోజున అవతల పారేసి, మరో వ్యాపారం వెతుక్కుంటాడు. అతడికా అవకాశముంది.

రైతు అలాకాదు, నష్టం వచ్చినా, ఏ యేటికాయేడు అదేపని చేస్తూనే ఉంటాడు. కొనేవాడు చెప్పే రేటుకే అమ్ముకుంటూంటాడు. మరో అవకాశం లేదతడికి. (పోనీ.., అతి తక్కువ అవకాశాలున్నై). స్థూలంగా చెప్పాలంటే.. ఆర్థిక ’అ’భద్రతలో వ్యాపారిలాగానూ లాభార్జనలో ఉద్యోగిలాగానూ ఉండేవాడే రైతు. చివరిగా..

ప్రస్తుత కాలంలో రైతు జాలిపడాల్సినవాడేగానీ, గౌరవించదగినవాడు మాత్రం కాకుండాపోయాడు.

Krishna K said...

చదువరి గారు చెప్పినట్లు రైతులది మాత్రం వింత పరిస్థితే. వ్యాపారం అనుకొందాము అంటే వారి వారి ఉత్పత్తులను స్వేచ్చగా అమ్ముకోలేరు ముఖ్యంగా ధాన్యం. అలాగని ఏదయినా భద్రత ఉందా అంటే అనుమానమే, ప్రబుత్వం విదిలిచ్చే సబ్సిడీలు గట్రాలు అసలు రైతు కు అందేది అనుమానమే!! విత్తనాలు, ఎరువులు etc. అన్నీ అవి నకిలీవి అని తెలిసినా కొనాల్సిందే, అంతా కష్టపడి పండిన పంటను అమ్ముకొందాము అంటే ప్రబుత్వ దయా దాక్షిణ్యాలమీద ఆధారపడాల్సిందే!!

రైతులు , సామాన్య సైనికులు లాగానే, చేనేత కుటుంబాల పరిస్తితి అలాగే ఉంది. వృత్తి మారండి అంటె వందల ఏళ్ళగా చేస్తున్న వృత్తి మేము కకపోతే ఇంకెవరు చేస్తారని మొన్న ఓ మితృడంటే కూడా ఇలానే బాధవేసింది. వారికి కాస్తో కూస్తో ఉప్పాధి కల్పిస్తున్న ఆప్కో లాంటి సంస్థలను, సహకార నూలుమిల్లులను దివాళా తీయించేపనిలో ప్రబుత్వాలు ఉన్నాయి.

నా దృష్టిలో ఆయాచితంగా వచ్చింది తింటూ కుర్చునే వారికంటే తమ కాళ్లమీద తాము నిలబడి కష్టపడి సంపాదించుకుంటూ కుటుంబాలను పోషించుకొనేవారు ఎవరైనా గొప్పవారే కాని, రైతులు, చేనేతలు etc మాత్రం కొంచం special, వారిని చూస్తే మాత్రం తప్పకుండా జాలి కలుగుతుంది :(

మంచు said...

పద్మవల్లి గారు: దన్యవాదాలు.
అనానిమస్ గారు: ధన్యవదాలు... మీ లింక్స్ ఇప్పుడే చుసాను
ఎన్నెల గారు: థాంక్స్ అండి...
మౌళి గారు: మీ కామెంట్ చూసాను. అర్ధం కాకపొవడానికి ఎమీ లేదు మీరు ఎదన్నా శ్లేష తొ రాస్తే తప్ప...
మలక్ : థాంక్స్ బాస్
అప్పి బొప్పి గారు: థాంక్స్ అండీ
శ్రీకర్ గారు, చదువరి గారు, కృష్ణ గారు : ధన్యవాదాలు. మీ అభిప్రాయలతొ పూర్తిగా ఎకీభవిస్తున్నాను. మీరు ఇంకా బాగా చెప్పగలిగారు.

Anonymous said...

*అన్ని వృత్తులూ గొప్పవే, దేని ప్రాముఖ్యత దానిదే.*
నాకు చదువరి గారు చెప్పింది సమంజసం గా లేదని పించింది. పైన చెప్పింది హిందూ మతం, దానిలో అంతర్ భాగమైన కుల వృత్తుల కోణం నుంచి చూస్తే ఒప్పుకోవచ్చు కాని ప్రస్తుత కాలం లో అన్ని వృత్తులు గొప్పవని చెప్పలేము. ఇప్పుడు ఏ వృత్తిలో డబ్బులు ఎక్కువ వస్తుందో అదే గొప్పది. మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ రంగం ఎక్కడలేని క్రేజ్ కి కారణాలు అందరికి తెలిసిందే. ఇప్పుడు గాలి ఐ.ఐ.యం. యం.బి.ఏ. ల మీదకి వేళ్ళింది. వీటీకి డిమాండ్ కి కారణం మధ్య తరగతి జనాలు వీటీ వెనక పడటం. వీటన్నిటి కన్నా పెద్ద వృత్తి రాజకీయాలు. గ్లోబలైసేషన్ తరువాత మధ్య తరగతి వారు పరిస్థిలకు అనుగుణం గా మారి కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని అభివృద్ది చెందారు. అదే రాజకీయ నాయకులు మాత్రం ఊరు కదలకుండా, చేసే పనిలో తమని తాము ఏమాత్రం మెరుగు పరచుకోకుండా, వ్యవస్థను మెరుగు పరచకుండా ఏమాత్రం కష్టపడకుండా ఉన్న ఊరిలో కుచొని కోట్లు పోగు చేసుకున్నారు. ఈ రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖ వ్యాపారులు( అంబానిలు మొ||) ప్రకృతి వనరులను వారి ఆధీనం లోకి తెచ్చుకొని కంపేనిలు పెట్టు కొన్నారు. కనుకనే రాజకీయలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. దీని పర్యవసానం రానున్న రోజులలో భారత దేశం నుంచి ఒక నారాయణ మూర్తి, ప్రేంజి లాంటి వారు స్వశక్తి తో వ్యాపార రంగం లో వచ్చి నిలదోక్కు కునే వారు ఉండక పోవచ్చు. ఎందుకంటె ఇప్పటికే రాజాకీయ న్అండదండలతో కొంతమంది ప్రకృతి వనరులు, టేలీకాం, చమురు, గనులు మొ|| అన్నిటిని ఆక్రమించేశారు. నాకు తెలిసి ఎమీ మిగలేదు. అధికశాతం మధ్య తరగతి వారు ఉద్యోగులుగా, కాంట్రక్ట ఉద్యోగిగా, కన్సల్టెంట్ గా వీరి కంపేనిలలో పగలు రాత్రి కష్టపడి పని చేసుకొంట్టు, మాహా ఐతే డబ్బులు ఎక్కువ తీసుకొనే కూలి వారిలా వీరి దగ్గర పని చేసుకోవలసిందే. వీరివి కుటుంబ వ్యాపారాలు కనుక ఉద్యోగులను ఇంఫోసిస్, విప్రో ఐ.టి. కంపేనిలలో లాగా ఉద్యోగులు సి.ఇ.ఓ. లు కావటం రానున్న కాలం లో కష్టమనిపిస్తోంది.

Mauli said...

@మీ కామెంట్ చూసాను. అర్ధం కాకపొవడానికి ఎమీ లేదు మీరు ఎదన్నా శ్లేష తొ రాస్తే తప్ప...

మీకు ఏమి అర్ధ౦ అయ్యి౦ది :)

Anonymous said...

*ప్రస్తుత కాలంలో రైతు జాలిపడాల్సినవాడేగానీ, గౌరవించదగినవాడు మాత్రం కాకుండాపోయాడు.*
అదే సైనికుల పరిస్థి ఇంకా ఘోరం గా ఉంట్టుంది. మనదేశం లో జరిగిన చాలా యుద్దాలకు కారణం పొలిటికల్ లీడర్షిప్ నిర్ణయాలు తీసుకోవటం లో విఫలం చెందడం ప్రధాన కారణం. పాకిస్తాను తో, చైనా తో యుద్దాలు ఆ కాలం నాటి రాజకీయ నాయకుల వైఫల్యం. దానికి తీవ్రవం గా నష్ట పోయేది సైనికులు. అంతేందుకు మన హోం మంత్రిగారు పదవి చేపట్టిన వెంటనే మీడీయా అటేన్షన్ కొరకు, తన పేరు ప్రఖ్యాతుల కొరకు నక్స్లైట్లను త్వరలో అణచి వేస్తాం అని ఉత్తర కుమారునిలా ప్రగల్భాలు పలికి మిలటరి వాళ్ళ ని పొట్టన పెట్టుకొన్నాడు. ఛతిస్ గర్లో నక్సలైట్లు చేసిన దాడిలోఒక బెటాలీయన్ లో ఒక్కరు మిగల కుండా దాదాపు 72 మంది చని పోయారు. అదికారులు వాస్తవ పరిస్థి గురించి చెపితే ఈ నాయకులు వినరు, వారిని అడవుల పరిస్థి పై అవగాహాన లేకపోయినా బలవంతంగా అక్కడికి పంపి వారి చావు కారణమైనాడు. ఇదే వేరే ఎదైనా ఉద్యోగంలో పైవాడు 100%తప్పు చేస్తున్నాడు అని తెలిసి ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయటానికి సిద్దపడతారా? ఇటువంటి పరిస్థిలో ఎవడైనా సైనికుడు కాని వాళ్ళ అధికారి గాని మేము పోము, యుద్దం చేయము అని వాదిస్తే వాళ్ళకి ప్రాణ భయం అని, దేశ భక్తి లేదని అందరు అంటారు. కనుకనే వాళ్ళు మన మంత్రులు తప్పు చేస్తున్నా తెలుస్తూ ఇటువంటి ఆపరేషన్ లో పాల్గోని ప్రాణాలు తీసుకొంటారు. వీరికి మన ప్రభుత్వం చేసే సహాయం చని పోయిన వారి కి ఇచ్చె డబ్బుల కొరకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పు కొంట్టుంది.

Mauli said...

హ హ ..ఇది మాత్ర౦ కరెక్ట్ :)
------------------------------

అన్ని జాతుల కన్నా దెయ్యాల జాతికి మనం కొంచెం గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే, ఆ దెయ్యాలు లేకపోతే రాత్రుల్లు ఇంత ప్రశాంతంగా మనం నిద్దురపోయేవాళ్ళమే కాదు. ఎంతో మంది దొంగలకు రాత్రుల్లు దొంగతనం చెయ్యాలని ఉన్నా, కేవలం దెయ్యం పేరు విని భయపడిపోతున్నారు. దాంతో, దొంగల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఎక్కడో కొద్ది మంది దొంగలకు దెయ్యాలతో స్నేహం ఉండటం వల్ల అక్కడక్కడా కొన్ని కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయేమోకానీ, మిగతా రక్షణ బాధ్యత అంతా మన ప్రియమైన దెయ్యంగార్లవే. అంతెందుకు, మన పిల్లలు రాత్రుల్లు పాస్ పోసుకోవడానికని బయటి కెళ్ళి తప్పిపోకుండా రక్షిస్తున్నది కూడా ఈ దెయ్యాలే. అందుకే దెయ్యాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.

--------------------

జై ప్రియ జై సృజన

Anonymous said...

దేశం కొరకు, దేశ ప్రజల కొరకు వారి నాయకులు తప్పులు చేస్తున్నా, తప్పు నిర్ణయాలు తీసుకున్నా పల్లెత్తు మాట అనకుండా ప్రాణలు పోగొట్టుకునే వారు సైనికులు మాత్రమే కనుక మొదట జై జవాన్ తరువాతే జై కిసాన్.

నాగప్రసాద్ said...

తిండి కలవాడే కండ కలవాడు. జవానుకైనా తిండి దొరక్కపోతే పోరాడలేడు.

cheekati said...

అసలు (సాఫ్ట్ వేర్) ఇంజినీర్లు లేకుంటే, ఇలా బ్లాగుల్లో రైతులపై,సైనికులపై ఫ్రీగా జాలి,గౌరవం కురిపిస్తూ, ఎవరు గొప్ప అని మనం డిబేట్లు చేసుకోగలిగేవారిమే కాదు.

Mauli said...

నాగ ప్రసాద్ గారు,
@ తిండి కలవాడే కండ కలవాడు. జవానుకైనా తిండి దొరక్కపోతే పోరాడలేడు.

body periginA , brain lEkpoathE yelA..

చీకటి గారు :)

చదువరి said...

శ్రీకర్: "నాకు చదువరి గారు చెప్పింది సమంజసం గా లేదని పించింది." :) రైతు బాధ చెప్పానంటే నా ఉద్దేశం సైనికుడు తక్కువవాడు అని చెప్పటం ఎంతమాత్రమూ కాదండి. ఏ వృత్తైనా తక్కువ అని చెప్పటమూ కాదు.

నా గత వ్యాఖ్యలో నేను రాసిందల్లా కేవలం వృత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే. అంతేగానీ ఆయా వృత్తుల్లోని ఉదాత్తతనో మరొకదాన్నీ దృష్టిలో పెట్టుకుని కాదు. ఏయేటికాయేడు నష్టపోతూనే ఉన్నా, మునిగిపోతూనే ఉన్నా వ్యవసాయాన్ని మానలేని పరిస్థితి. నేత వృత్తి లాంటి మరికొన్ని కూడా అలాగే ఉన్నై. కానీ ఆ వృత్తులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం వాటి అవసరం ప్రస్తుతం లేకపోవడమే (యాంత్రికీకరణ కారణంగానో మరో రకంగానో). కానీ వ్యవసాయం అలాంటిది కాదు.. దాని అవసరం లేని రోజు ఇంకా రాలేదు.. ఇప్పుడప్పుడే రాదు కూడాను. పైగా జీవాధారం, అది లేందే మనుగడే లేదు. సైనికుడక్కర్లేని దేశాలు, సైనికుడసలే లేని దేశాలూ ఉన్నాయేమోగానీ, రైతు అక్కర్లేని దేశం లేదు. అయినా... వ్యవసాయం, రైతూ బంతిలో చివరే! పోనీ వడ్డించేవాడు మనవాడా అంటే, గరిటెను తిరగేసి వడ్డించేవాళ్ళే అందరూ!

మరోసారి.. ఆదాయపరంగా, ప్రాముఖ్యత పరంగా, ప్రభుత్వ ప్రాధాన్యతల పరంగా వ్యవసాయమున్న పరిస్థితిలో ఇతర వృత్తులు లేవని నా ఉద్దేశం.

మంచుగారూ, మీ తుది వ్యాఖ్యతో ఇక ఈ చర్చ ముగిసిందనుకున్నారేమో మీరు.. మేం మాత్రం మళ్ళీ కొనసాగిస్తున్నాం. :)

Anonymous said...

లాల్ బహదూర్ శాస్త్రి అంతటివాడే జైజవాన్, జైకిసాన్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళే.
ప్రాణాన్నే పణంగా పెట్టడమే (Ultimate Sacrifice) కాకుండా క్లిష్టమైన పరిస్థుతుల్లో పని చెయ్యాలి కాబట్టి వీళ్ళిద్దర్లో సైనికుడే గొప్ప.
అంతెందుకు, ఎంతమంది ఉన్న ఉద్యోగం వదిలేసి అదే జీతానికి సైన్యంలో చేరడానికి రెడీ అవుతారు?

Sravya V said...

కృష్ణ గారు , చదువరి గారు , శ్రీకర్ గారు , వజ్రం గారు వీలయితే "corporate farming" మీద మీ అభిప్రాయం చెప్పగలరా ? I am just curious to know .

Anonymous said...

మళ్ళీ జవాన్ రైతులలో ఎవరు గొప్ప అని చర్చా.. :)

Anonymous said...

మొదటి సారి 100 కామెంట్స్ ..మంచి పోస్ట్ మంచి చర్చ ..కంగ్రాట్స్

Anonymous said...

/అంతెందుకు, ఎంతమంది ఉన్న ఉద్యోగం వదిలేసి అదే జీతానికి సైన్యంలో చేరడానికి రెడీ అవుతారు? /
తీసుకునే వారుంటే నేను రెడీ.

చదువు రాని/కోని వాళ్ళు మాత్రమే పొలాలుంటే రైతులుగా, లేకుంటే రైతు కూలీలు/సైనికులుగా వెళ్ళడం సాధారణం. ఓ సారి చేరాక, సైన్యంలోంచి 20ఏళ్ళలో బయటికి రావడం కుదరదు కాబట్టి అలా కొనసాగాల్సి వస్తుంది. టీచర్ వృత్తి మాత్రమే నోబుల్ ప్రొఫెషన్( వ్యక్తులు కాదు) అని నేను తీర్మానిస్తున్నాను, పేచీ పెట్టక ఒప్పేసుకోండి.:)

మంచు said...

ఆకాశరామన్న గారు: మీరు ఇచ్చిన లింక్ చూసాను.. ఆబ్వియస్గా పెద్దగా రుచించలేదు :-)

మౌళీ గారు... పైన ఉన్న 101 కామెంట్లలొ కాకుండా కొత్త విషయం ఎమన్నా రాసారా? నాకు అంతకు మించి కొత్త విషయం ఎమీ అర్ధం కాలేదు

చీకటి గారు: మీకు రెండు విషయాలు చెప్పాలి.
1. మనం చర్చించుకొక పొతే పెద్ద నస్టం లేదు... అదే విషయం కొన్ని రొజులు అన్నం మానేసి చూడండి...తెలుస్తుంది. జాలి, గౌరవం అన్నది మనసుకి సంబందించిన విషయాలు. వాటికి విలువ కట్టే ప్రయత్నం చెయ్యకండి. ఫ్రీగా కాకుండా డబ్బులు తీసుకుని మీరు గౌరవం చూపిస్తారా?
2. నేను రాసిన విషయం లొ ఎక్కడా ఎవరు గొప్ప అని కంపేర్ చెయ్యలేదు... అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదు. మీరు ఎందుకు ఆ టాపిక్ ఎత్తుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యొగులరుగురించి వాళ్ళ కస్ట సుఖాల గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటూన్నా. దయచేసి ఇక ఆ కంపేరిజన్ తీసుకురాకండి.

మంచు said...

శ్రీకర్ గారు.... మీరు చెప్పినది నేను ఒప్పుకుంటాను.... చదువరి గారు చెప్పినట్టు...రైతు బాధ చెప్పానంటే నా ఉద్దేశం సైనికుడు తక్కువవాడు అని చెప్పటం ఎంతమాత్రమూ కాదండి.... జవాన్ చూస్తే లేచి సాల్యూట్ కొట్టాలనిపిస్తుంది....రైతు ని చూస్తే జాలి కలుగుతుంది.
చదువరి గారు: బాగా చెప్పారు. తుది వ్యాఖ్య కాదండీ...:-)) మీరు ఎంత రాస్తే అంత మంచిది :-) నేను చెప్పాలనుకున్నదే మీరు మరింత బాగా చెప్పగలుగుతారు.
బొనగిరి గారు... థాంక్స్ అండీ... :-) జై జవాన్...జై కిసాన్...
శంకర్ గారు :
>>>> తీసుకునే వారుంటే నేను రెడీ. >>>>... తీసుకుంటారు... అయితే దానికి మీరు చాలా కస్టపడాలి... ఇప్పటికిప్పుడు తీసుకొలేరేమో...
>>>టీచర్ వృత్తి మాత్రమే నోబుల్ ప్రొఫెషన్( వ్యక్తులు కాదు) అని నేను తీర్మానిస్తున్నాను, పేచీ పెట్టక ఒప్పేసుకోండి.:) >>>
" మాత్రమే " తీసేస్తే ఒప్పేసుకుంటా....

అనానిమస్ గారు... థాంక్యూ....

Anonymous said...

అలాగే,'మాత్రమే ' తీసేస్తున్నా, ఒప్పేసుకోండి:)

మాతృ దేవోభవ!
పితృ దేవోభవ!
ఆచార్య దేవోభవ!

ఆ తరువాత కర్షక, సైనిక, కార్మిక, శాస్త్రవేత్త దేవోభవ! :)

గిరీష్ said...

touched..good one

మంచు said...

Oppeskunna. Mari istamayina progression kadaa :-)

మంచు said...

Paina comments raasina engineerlaki, technology priyulaki oka vinnapam. Nenu raisina tapaallo inchuminchu sagam technology meede untaayi. Meelo evarni akkada chusina gurtuledu . Paapam kissan ki javaan ki mee gouravam teesukune adrustam ledemo ponlendi. Meeru nenu rasina technology postlanu mee medhassu to visleshinchi mee amoolyamayina salahaalu andistaarani aasistaanu. :-)
Technology ni engineering ni prajalaku parichayam cheyyadam lo , vaatiki gouravam teesuku raavadam lo meeku naaku unna nibaddata ento charchinchu kundaam :-)

చదువరి said...

snkr: "..అని నేను తీర్మానిస్తున్నాను, పేచీ పెట్టక ఒప్పేసుకోండి." - మీరింత మర్యాదగా చెప్పేసాక, ఇక చేసేదేముంది.. అలాగే ఒప్పేసుకుంటాం. :)

Sravya Vattikuti: కొన్నేళ్ళలో మా కుటుంబాల్లో ఈ కార్పొరేట్ వ్యవసాయం అవసరం పడేట్టుందండి. బహుశా తుమ్మల అగ్-వెంచర్స్ లిమిటెడ్ లాంటి సంస్థలను చూస్తాం. :)

మంచు గారూ, వ్యవసాయం పరిస్థితి మీద మీరు మరింత విస్తృతంగా రాయాలి.

..nagarjuna.. said...

కామెంట్లు మొత్తం చదవలేదుగాని..పోస్ట్ చదివాక కలిగిన అభిప్రాయాలు చెబుతున్నా మంచుగారు,

మరొకడిపై బలప్రయోగం చేసి లొంగదీసుకోవాలనుకునే భావం మానవజాతిలో ఎక్కడొఅక్కడ ఎవరోఒకరి దగ్గర ఉండే ఉంటుంది. మనతో వ్యక్తిగతంగా ఏ వైరుధ్యం లేకపోయినా కేవలం నియంతృత్వం కోసమనో, ద్వేషం కారణంగానో ఒక సమాజంపై దాడి జరిగితే దాన్ని అడ్డుకొని నిల్చునేవాళ్లకు ఖచ్చితంగా సమున్నత స్థానం ఇవ్వాల్సిందే,ఎందుకంటే ఆ వ్యక్తి/వ్యక్తులు కాపాడింది మానవ స్వాతంత్ర్యాన్ని. వాతావరణం అనుకూలించని మారుమూల ప్రదేశాల్లో సైతం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వాళ్ల ’డ్యూటి’ చేసే జవానుకు మిగతావారికంటే ఎక్కువ గౌరవం ఇవ్వడంలో తప్పులేదు.
ఇక్కడ నా స్వానుభవం ఒకటి చెప్పాలి, గతేడాది సిక్కిం వెళ్ళినపుడు 14,000 feets ఎత్తులోవున్న Indo-China సరిహద్దుకు వెళ్ళాం. అక్కడ సంవత్సరంలో కనీసం ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలేనట. అలాంటి పరిస్థితుల్లో సైతం జవాన్లు 24x7 పనిచేయాలి. పని సజావుగా చేయడానికి వాళ్లకు దొరికేది బంకర్లలలో ఉండి చేసే వేడి ఛాయ్ మాత్రమే (మామూలుగా మనం కావాలనుకునే ఓ క్యూబికల్, మోడర్న్ ట్రాన్స్‌పోర్ట్ etc etc లతో చూసుకుంటే ).

మిగతా ఉద్యోగాలు గట్రా మనం కావాలనుకునే ’సర్వీసులు’ అవి మనుగడకు ఆవశ్యకం కావు. జవాను ఆ ’ఆవశ్యకత’ కోసం పనిచేస్తున్నాడు...and there's no profit in that business after all, సైనికులను తలపై పెట్టుకోనక్కరలేదు కాని వాళ్లకు కొంచెం ఎక్కువ concern చూపించడంలో తప్పులేదు.

రైతుల విషయంలో నేను కొద్దిగా శ్రావ్యగారితో, ఆకాశరామన్నగారితో ఏకీభవిస్తాను. విధానల్లో లోపం, వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ కారణంగా రైతు ఇలా ఉన్నాడుగాని, భారతదేశంలాంటి దేశంలో ప్రకృతి విపత్తులు రైతును కోలుకోలేనంతగా దెబ్బతీసేట్టు ఎప్పుడూలేవు. రైతుకి కావలసింది వాళ్ల సమస్యల పట్ల సంఘీభావం, కాస్త శ్రద్ధ చూపెట్టే విధానాలు.

Rao S Lakkaraju said...

నా ఉద్దేశం లో మానవుల మనుగడకి కావాల్సినవి మూడు.
1. జీవించటానికి తిండి.
2. రోగాలూ రొచ్చులూ లేకుండా జీవించటం.
3. జీవించటానికి తగిన రక్షణ.
ఈ మూడూ కల్పించే వాళ్లకి మనం మొక్కాల్సిందే.

Anonymous said...

చదువరి , Mancu :)

రావు గారు, మానవుల మనుగడకేగాదు, ఆ మూడు ఏ జీవికైనా కావాల్సినవే. సో, అవి పక్కనపెడితే... What is making humans different from other species? It is knowledge that gives us quality of life, not just living.
సైనికుడు, రైతు, డాక్టర్, సెమి-స్కిల్డ్ లేబరైనా ఓ గురువు అనేవాడు వుండితీరాలి లేదంటే "గొడ్డుకీ మడిసీ తేడా ఏముంటుందండీ " :) అందుకే ఆచార్యదేవోభవ! అంతే! మీరు ఒప్పుకోవాలి.:)

Rao S Lakkaraju said...

@snkr గారూ
మీరన్నట్లు ఆ మూడు ఏ జీవికైనా కావాల్సినవే.వాటిని పరిపూర్ణత్వం తో చెయ్యాలంటే గురువుగారు కావాలి తప్పదు. ఆచార్య దేవోభవా. You are absolutely right.

Krishna K said...

@SNKR,
ఆచార్యదేవోభవ! అంతే! మీరు ఒప్పుకోవాలి.:)

ఒప్పుకోకపోవటం అంటూ ఏమీ లేదండి, అందులో ఓ ఉప్పాధ్యాయుడి కొడుకుని కూడా :), కాకపోతే "ఆచార్యదేవోభవ" అన్న రోజులలోని ఆచార్యులు ఇంకా ఎంతమంది మిగిలిఉన్నారా అన్నది మాత్రం ప్రశ్నే? నాకు తెలిసిన ఒకరు ACTO (Asst. Commercial Tax Officer) గా ఉద్యోగం వస్తే అందులో లంచాలు తీసుకోవటం తప్పటం లేదని, దానిని వదిలి బతుకలేని బడిపంతులు అనే నానుడి నిజంచేసే రోజులలోనే ఉపాధ్యాయుడి గా చేరి, ఒక్క పైసా ఆశించంకుండా చిన్న పల్లెటూరులో వాళ్లు వీళ్లు అన్న బేధం లేకుండా చదువు చెప్పారు. మరి ఈరోజులలో కనీసం ఒ B.Ed తీచరుకు పదిహైదు వేలపైనే జీతం తీసుకొంటున్నా ఎంతమంది ఆ వృత్తికి న్యాయం చేరుస్తున్నారంటారు? ఇక కాన్వెంట్ లు, కాన్సెప్ట్ స్కూళ్ల గురించి మాత్రం మాట్లాడలేమని మీకు తెలియంది కాదు కదా? కాకపోతే అక్కడక్కడా ఇంకా తులసి మొక్కలు లాగా మిగిలి ఉన్న గురువులను మాత్రం తగులుతున్నారన్నది నిజం. కాని చాలా తక్కువ గా అన్నది మాత్రం కూడా నిజం.

ఇక చదువరి గారి తో ఏకీభవిస్తున్నా, చేనేతను ఎందుకు తెచ్చాను అంటే దృశ్యం లోకి, ఆ వృత్తిలో కష్టం తప్ప మిగిలే లాభం లేదని తెలిసినా, వెరే వృత్తులలోకి మారే అవకాశాలు ఉన్నా వృత్తి మీద గౌరవంతోనో, ప్రేమతోనో మారని మనుషులు ఎక్కువగా (నా వరకు) కనిపించారు కాబట్టి మాత్రమే. ఇక చేనేతకు నిజానికి చాలా మంది అనుకొంటున్నట్లు మరమగ్గాలో ఇంకేవో రావటమో, డిమాండ్ తగ్గటమో కంటే, సామాన్య చేనేత వాళ్లను కాపాడగలిగే సంస్థలను నిర్వీర్యం చేయటం వలన జరిగిన/జరుగుతున్న నష్టమే ఎక్కువ. ఉ.దా. లాభం తప్ప, నష్టపోని ధాన్యం దళ్లారో, రైసు మిల్లు యజమాని లాగానో, ప్రభుత్వ వంకర విధానాల వలన ఏ మాస్టర్ వీవర్, ఎక్స్పోర్టరూ రోజు రోజుకూ లాభాలు పెంచుకొనేవారే కాని, నష్టపోయిన వారంటూ లేరు. అందుకనే ఆ కంపేరిసన్ తెచ్చింది.

Krishna K said...

నాగార్జున గారు కూడా మంచి పాయంటు పట్టారు " రైతుకి కావలసింది వాళ్ల సమస్యల పట్ల సంఘీభావం, కాస్త శ్రద్ధ చూపెట్టే విధానాలు" అని అది నిజమే అంతకంటే రైతు కు కావాల్సింది ఇంకేమీ లేదు. "ఆయనే ఉంటే ఇక మంగలి తో పనేమిటి అన్నట్లు" అవి లేకనే రైతు పరిస్థ్తి రోజు రోజుకూ తీసికట్టు అవుతుంది. అందుకనే చాలా మంది గౌరువం తో కూడిన జాలి చూపుతుంది కూడా ఆ వృత్తి అంటే.

శ్రావ్య corporate వ్యవసాయం గురించి అన్నారు, అది ఓ పెద్ద టాపిక్కు, నా వరకు ప్రస్తుతం మనం చూస్తున్న western world ముఖ్యం గా అమెరికాలో నేను గమనించిన corporate వ్యవసాయం మాత్రం మన భారతదేశానికి పనికి రాదు. కారణాలు కోకొల్లలు. అలాగని ఇప్పుడు ఉన్న ఎకరా, రెండెకరా చెక్కలతో ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం వలన కూడా రైతు పెద్దగా బాగు పడుతుంది అంటూ ఏమీ లేదు. అంతేకాక చిన్న రైతులు అందునా కౌలు రైతులు రోజు రోజు పెరుగుతున్న పరిస్తుతుల వలన సంఘీభావం తగ్గిపోవటం, రైతు నాయకులు తగ్గిపోవటం వలన కూడా, ఇంతక ముందు ఉన్న checks & balances ఏ మాత్రం పనిచేయటం లెదు. ఇప్పుడు కావాల్సింది మనకంటూ సొంత వ్యవసాయ విధానాన్ని రూపొందిచుకోవటం (probably a hybrid system like సహకార వ్యవసాయం), ప్రబుత్వం పెద్దగా సహాయం చేయకపోయినా పర్వాలేదు, వారి వారి విధానాలతో ఉన్న కాసిని support systems ను తీసివేయకుండ మో/ నిర్వీర్యం చేయకుండా ఉండటమో, అలాగే రైతును కాసింత స్వేచ్చగా తమ ఉత్పత్తులను అమ్ముకోనిస్తే సరిపోతుంది అనిపిస్తుంది.

నా వరకూ రైతుది ముఖ్యం గా ధాన్యపు రైతు ది మాత్రం జాలిగొలిపే పరిస్థితే. ఏమయినా అనుమానాలు ఉంటే ఇంకా నిరుటి వడ్లు పురులు నిండా నింపుకొని, ఈ ఏడు అరా కొరా పండిన వడ్లు నూర్పితే ఏడ పోసుకోవాలో తెలియక, కొనే వాడికోసం చూస్తున్న పల్లెటూర్లు ఓ పాలి చూసి రండి, అర్ధం అవుతుంది. ధ్యాన్యానికి డిమాండ్ లేదా అంటే గత కొద్ది సంవత్సరాలుగా డిమాండ్ మరియు రేట్లు ప్రపంచవ్యాప్తం గా పెరిగిన వాట్లో బియ్యం ముఖ్యం గా సోనా మసూరి లాంటి సన్న బియ్యం ఒకటి. మరి రైతుల పరిస్థితికి కారణం ఎవరంటారూ? ఆ విధానాలను ఏ మాత్రమయినా ఓ బక్క రైతు ప్రభావితం చేయగలడంటారా? గౌరవం తో కూడిన జాలి కూడా పడవద్దంటారా ఆ రైతులను చూసి?

మరొక్కసారి, "నా దృష్టిలో ఆయాచితంగా వచ్చింది తింటూ కుర్చునే వారికంటే తమ కాళ్లమీద తాము నిలబడి కష్టపడి సంపాదించుకుంటూ కుటుంబాలను పోషించుకొనేవారు ఎవరైనా గొప్పవారే కాని, రైతులు, చేనేతలు etc మాత్రం కొంచం special, వారిని చూస్తే మాత్రం తప్పకుండా జాలి కలుగుతుంది :("

Sravya V said...

కృష్ణ గారు నేను సరిగా చెప్పలేకపోయనేమో తెలియదు కాని నేను చెప్పింది గౌరవం తో కూడిన జాలి కూడా పడవద్దు అని కాదు :) వృత్తిని చూసి కాక చేసే వ్యక్తీ ని బట్టి గౌరవం ఇవ్వమని . వీలయితే ఒక సారి ఇక్కడ చూడండి http://sravyav2020.blogspot.com/2011/01/blog-post.html .

Krishna K said...

@శ్రావ్య, మీరు అన్నారు అన్న ఉద్దేశ్యం తో కాదు నేను ఆ కామెంట్ వ్రాసింది, రైతుల కష్టాలు తెలియకో, వారు చూసిన ధనిక రాజాకీయ/రైతు నాయకులను, వందల ఎకరాల రొయ్యల/చేపల చెరువుల వారిని చూసో, రైతులంటె మారుతి కారులలో, latest ట్రాక్టర్లు కొని తిరిగే వారో అనుకొనే నా కొద్ది మంది సహోద్యుగులను ఉద్దేశించి వ్రాసింది.

మీ ఉదేశ్యాలకు, చదువరి, మంచు, నాగార్గున etc. ఉద్దేశ్యాలకు పెద్దగా తేడా ఉన్నట్లు మాత్రం నాకు కనిపించలేదు. కాకపోతే టాపిక్ మంచిది, చర్చ మంచిది అన్న ఉద్దేశ్యంతో నే అంత పెద్ద కామెంట్ ఎట్టింది :)

Krishna K said...

snkr అన్నట్లు అందరమూ ఒప్పుకొన్నట్లే ఆచార్య దేవోభవ ఎలానో, వృత్తిని బట్టి కాక వ్యక్తిని బట్టి, తను కష్టపడే విధానాన్ని(నిబద్దత) బట్టి గౌరవించాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు.

దాని తర్వాత మూసగా వృత్తులను వృత్తులుగా చూస్తున్నప్పుడు, వ్యక్తులుగా కాకుండా మాత్రమే, అప్ప్పుడు కూసింత జాలి కలిగేది.

రోజుకు 300 రూపాయల కూలి తీసుకొంటూ తోటి రైతు అయి కూడా, ఓ ప్రక్క ముసురు పడుతున్నప్పుడు కూడా, నింపాదిగా కల్లం లోకి దిగే రైతులని చూసాను కాబట్టి రైతులందరినీ గౌరవించాలని మాత్రం చెప్పలేను. కాని ఓ వృత్తిగా దానిని ఇంకా అంటిపెట్టుకొని, నష్టాలు, కష్టాలు వస్తున్నా నిబద్దతగా అ వృత్తిమీద ప్రేమతో చేస్తున్న వాళ్లను కోకొల్లలు గా చూస్తున్నా కాబట్టి, ఆ వృత్తి వలన వచ్చే product అందరకూ తప్పనిసరి కాబట్టి, ఆ కోణం లో వ్రాసాను, అంతే కాని ఈ చర్చలో అందరమూ "దాదాపు" ఓ ప్రక్క నుండే వాదించామనుకొంటున్నాను.

Bhardwaj Velamakanni said...

Wow, I missed a lot here

..nagarjuna.. said...

corporate farming ! దీనికంటే నాకు co-operative farming,వివిధ శాఖల (Geology, weather forecast, seed engineering,farmers) సమన్వయంతో ఉండే large scale co-operative farming ఆసక్తికరంగా అనిపిస్తుంది.

..nagarjuna.. said...

ప్పైనల్‌గా ’ఆచార్య వృత్తి దేవోభవ’ అంటే ఎవరికి ఏ అభ్యంతరము లేదుకదా !!?

Anonymous said...

రావు గారు,శ్రావ్య, నాగార్జున గార్లకు... అదేంటది .. ఆ... నెనర్లు.
కృష్ణగారు ఆయా వృత్తుల్లోని సాధకబాధకాలను చక్కగా వివరించారు, నెనర్లు.

భరద్వాజ గారికి కూడా ముందస్తు నెనర్లు. :)

చదువరి said...

krishna: "..ఆయాచితంగా వచ్చింది తింటూ కుర్చునే వారికంటే .." బాగా చెప్పారు.

snkr: భరద్వాజ గారికి ముందే నెనర్లు చెప్పేసారు. చెప్పీ చెప్పగానే ఒప్పేసుకున్న మంచుగారినీ నన్నూ మాత్రం అసలు పట్టించుకోలేదు. మీరు గమనించారా? (గుడ్ మాణింగ్ ఎలాగూ చెప్పలేదు) :)

వజ్రం said...

@Sravya Vattikuti
భారతదేశంలో మీరన్నట్లు "corporate farming" మొదలై తే రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది.సన్నకారు రైతులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేని స్థితిలో ఉండటం వల్లనే,వారిని వ్యతిరేకమైన నిర్ణయాలు, వారి ప్రమేయం లేకుండానే అమలు జరిగిపోతున్నాయి. corporate farming పై ప్రస్తుతానికి వివరంగా రాయలేనుకానీ,తరవాత దీనిపై ఒక పోస్ట్ రాయటానికి ప్రయత్నిస్తాను.అప్పుడు మిమ్మల్ని చదవటానికి తప్పకుండా ఆహ్వానిస్తాను.

Anonymous said...

*వృత్తిని బట్టి కాక వ్యక్తిని బట్టి, తను కష్టపడే విధానాన్ని(నిబద్దత) బట్టి గౌరవించాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు.*

నేను చర్చ జవాన్, కిసాన్ ల ఇద్దరికే పరిమిత మనుకొన్నాను. కాని గురువుల nu మధ్యలో చేర్చారు. అలా ఐతే ఎన్నో వృత్తుల సాధక బాధకాలను తీరికగా చర్చించ వచ్చు. నా వరకైతే అన్ని వృత్తులు ఈ ఆధునిక కాలం లో సమానం కావు. వ్యక్తిని కష్టపడే విధానాన్ని నిజజీవితం లో ఎవ్వరు గౌరవించరు. ఇక్కడ ప్రస్తావించే వృత్తులన్ని ఒక దేశ/ప్రజల అస్తిత్వాన్ని కాపాడి, వాటి ఇమేజ్ ని పెంచేవాటి గురించి రాస్తున్నారు. గురువు వలన చదివిన వెంటనే డబ్బులు రాక పోయినా కొన్ని రోజుల తరువాత ఐనా ఉద్యోగం వచ్చి అధికారం, డబ్బులు సంపాదించటానికి ఉపయోగపడుతాడు. కనుక అతనంటె చాలా మందికి అభిమానం ఉండవచ్చు. అదే ఒక వృత్తి వలన డబ్బులు కాని అధికారం కాని ఉండవనుకోండి. ఎంత మంది ఆ వృత్తిని గౌరవిస్తారు ? కనీసం ఆ వృత్తిని తలుచు కొంటారు? ఉదా|| తలారి (ఉరి తీసే వాని)వృత్తి. ఎవడైన కోర్టు ఆదేశానుసారం ముద్దాయికి ఉరి శిక్ష అమలు జరిపాడను కోండి, అతడిని మనం ఎవరైనా వృత్తి చాలా బాగా చేశాడని గౌరవిస్తున్నామా? చాలా మందికి అదొక వృత్తి అని కూడా తెలియవు. కాని ఈ వృత్తి గురించి కొంతకాలం క్రితం పేపర్లో రాశాడు. కారణం మనదేశం లో ప్రస్తుతం ఉరి శిక్ష అమలు జరిపే వారి సంఖ్య సింగిల్ డిజిట్ కొచ్చిందని ఇటువంటి వారు ఒకరో ఇద్దరో ఉన్నారని రాశారు. అది అవసరం కాబట్టి, లేక పోతే మనదేశం లో ఉన్న ఆఖరి ఐదుగురు తలారిలు వారి పేర్లు కుటుంబం గురించి ఎవరైనా నా రాసారా?

Sravya V said...

వజ్రం గారు ఇక్కడ కూడా కొద్ది గా నేను విభేదిస్తాను , ఒకవేళ నిజం గా ఇండియా లో corporate farming" మొదలైతే ముందుగా జరిగేది చిన్న సన్న రైతులు కాస్తా రైతు కూలీలు గా మారటం . మరి ఇది ఎంత మనవాళ్ళు ఎంతవరకు జీర్ణించుకుంటారొ తెలియదు . ఎదైమైనా మీ అభిప్రాయలతొ ఒక టపా రాయండి
శ్రీకర్ గారు ఇదే పరిస్తితి ని ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం హటాత్తుగా పాకిస్తాన్ , ఇండియా ఒక ఒప్పడానికి వచ్చి కాశ్మీర్ సమస్య పరిష్కారం ఐంది అనుకుందాం , అలాగే చైనా , ఇండియా కూడా హిందీ -చీనీ భాయి భాయి అని ప్రేమలో మునిగిపోయారు , ఇక బంగ్లాదేశ్ పెద్దన్నయ్య అంటూ భారతదేశాన్ని నువ్వు చెప్పిందే నేను చేస్తా అంటుంది . ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచాయి , నో యుద్ధం , నో గొడవలు , అప్పుడు మన జవాన్ల ని కూడా మీరు ఇప్పుడు పైన చెప్పిన ఉదాహరణ తో పోల్చచ్చు అంటారా ?
చదువరి గారు శంకర్ గారు మీరు నెనర్లు చెప్పలేదు అని మీరు ఆలోచిస్తున్నారు నేనేమో నాకెందు కు చెప్పరా అని ఆలోచిస్తున్నా :)

Anonymous said...

చదువరీ .. పైన మీ ఇద్దరూ ఒప్పుకున్నందుకు స్మైలీ పెట్టి మరీ పెసర్లు సమర్పించానే, సారీ నెనర్లు.

శ్రీకర్ గారు, తలారి వృత్తి బాగా చేశాడనడానికి మనమెలా సర్టిఫికేట్ ఇవ్వగలం? వాడితో ఆపని చేయించుకున్న కస్టమర్ చెప్పాలి, అది అసాధ్యం కాబట్టి తలారి పని బాగుండే ప్రశ్నేలేదు. గౌరవనీయమని పని చేసినాడని రాష్ట్రపతితో పద్మభూషణ ఇప్పించలనడం సరికాదనుకుంటా.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

@శ్రావ్య,
*ఒక 10 సంవత్సరాలు గడిచాయి , నో యుద్ధం , నో గొడవలు , అప్పుడు మన జవాన్ల ని కూడా మీరు ఇప్పుడు పైన ఉదాహరణ తో పోల్చచ్చు అంటారా *

ఈ ప్రశ్నకి సమాధానం వాస్తవిక దృక్పదం తో ఆలోచిస్తే మనం ఒకసారి గతాన్ని చూస్తే. ఆది కావ్యమైన రామాయణం లో రాజు, సేవకులు, గూడఛారుల పాత్రలు ఉన్నాయి. అంటె దీని అర్థం కొన్ని వేల సం || నుంచి ఈ పాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి, రాజరికం పోయినా ప్రజాస్వామ్యం వచ్చినా. పది సం|| మంచిగా ఉన్నా దేశాలు వాటి జాగ్రత్తలో వారు ఉంటాయి. టు టౌన్ పోలిస్టేషన్ పరిధి లో పది సం|| నుంచి ఒక్క దొంగతనం లేదని ఎత్తి వేస్తే ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజల దగ్గర ఎంత కాలం సంపద ఉంట్టుందో అంత కాలం పోలిస్ అవసరం ఉంట్టుంది. దేశం దగ్గర సంపద ఉంటె సైనికుల అవసరం ఉంట్టుంది. యుద్దం అవసరం ఉన్నా లేక పోయినా. సైనికులు ఉంటారు కనుక వారు దేశ సరిహద్దులు పనిలో భాగం గా కాపలా కాయాలి.
----------------------------------------------------------------------------------
*వృత్తిని బట్టి కాక వ్యక్తిని బట్టి, తను కష్టపడే విధానాన్ని(నిబద్దత) బట్టి గౌరవించాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు.*

శంకర్, పైన వాఖ్యాన్ని ఈ విధం గా కూడా అర్థం చేసుకోవటం లో తప్పు లేదను కుంటాను. ఏ వృత్తి లో ఉండే వారైనా తను కష్టపడే విధానాన్ని(నిబద్దత) బట్టి గౌరవించాలి అన్నపుడు ఒక తలారి నో లేక కాటి కాపరి నో ఎంత మంది గౌరవిస్తారు? అని నా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం, పద్మా అవార్డుల వరకు పోనవసరం లేదు. మనలో చాలా మంచి అటువంటి వారి వృత్తిని పరిశిలించటానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఎదో అవసరం కొద్ది ఆ సమయం లో డబ్బులు ఇచ్చి చేయి దులిపేసుకొంటారు కాని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టరు కదా?

Anonymous said...

\మనలో చాలా మంచి అటువంటి వారి వృత్తిని పరిశిలించటానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఎదో అవసరం కొద్ది ఆ సమయం లో డబ్బులు ఇచ్చి చేయి దులిపేసుకొంటారు కాని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టరు కదా?\

క్షమించండి. మీ తలారి ఉదాహరణ లో .. " అతని పని(తనాన్ని అనుకుంటా) మెచ్చుకుని గౌరవించడం .." అర్థంకాలేదు. ఎవడు పని వారు చేస్తుంటారు, కళాత్మకంగానో, ఎఫిసియంట్ గానో చేసినపుడు వాళ్ళ బాస్ మెచ్చుకుని నజరానా ఇవ్వడం అనవాయతి.
మనమూ మెచ్చేసుకుని టిప్ ఇవ్వొచ్చు, కాని ... మన ఇంటికి పిలిచి భోజనాలు, సంతర్పణలు చేయమంటే ...హుమ్మ్మ్... కుదరకపోవచ్చు. వాటితో నాపనికి న్యాయం చేయలేకపోతాను, ఆపాపం తలారి మీద పడనివ్వను.

ఎపుడూ మెప్పుకోలుకోసం, టిప్ లు సదా ఆసించే పనికాడు, వాటికి మాత్రమే అర్హుడు, గౌరవనీయుడా కాకపోవచ్చు. మీరన్నట్లు భోజనం పెడితే గౌరవించినట్టు అని కూడా నేను అనుకోను. గౌరవం ఓ మౌన సందేశం, ఓ ప్లెసంట్ జెస్చర్ ద్వారా ఇస్తాము.

వజ్రం said...

Already 130

కృష్ణప్రియ said...

చాలా లేట్ గా చర్చ లోకి వచ్చినట్టున్నాను.. పోస్ట్, చాలా వరకూ కామెంట్లూ చదివాక, నేను కొత్త గా చెప్పే విషయం అయితే ఏమీ లేదు నా వ్యక్తిగత అభిప్రాయం తప్ప..

ఎవరైనా సరే వృత్తి ని ఎంచుకున్నాక, వేరే సులభమైన దారో, (రిస్క్ లేని పనీ, ఎక్కువ డబ్బోచ్చేపనీ, లేదా.. ఏదో తమ ఇష్టం కోసమో, passion కోసమో, ఎంచుకునే వారుంటారు.

కొందరు తమ వ్యక్తి గత కారణాలవల్ల్లో, లేక కుటుంబం కోసమో ఉన్నతావకాశాలని వదులుకోవటం కూడా చూస్తూనే ఉంటాము. మరి కొందరు (టీచర్లు, వైద్యులూ etc) ఒక ఊరికి సేవ చేద్దామనో, లేక ఒక స్కూల్ కోసం ఉండిపోవటమో.. లాంటివాటికోసం, తమ అవకాశాలు వదులుకుంటారు.

సమాజానికి హాని చేకూర్చని అన్ని వృత్తులూ సమానమే.. గౌరవింపదగ్గవే.. అన్ని వృత్తుల్లో స్వార్థానికి సమాజ హితాన్ని పణం గా పెట్టే ప్రభుద్ధులూ ఉంటారు..

(అందరూ కాకపోయినా) మంచు గారు చెప్పినట్టు, వేరే అవకాశాలున్నా సమాజ హితం కోరి 'ఎవరూ చేయకపోతే.. గింజలెలా వస్తాయి? ' అనుకునే సన్నకారు రైతులు, ప్రాణానికి హాని ఉందని తెలిసినా.. సామాన్య ప్రజలకి రక్షణ అందించటానికి నిజాయితీ గా ముందుకెళ్ళే చిన్న కాడెర్ పోలీసులూ etc నాకు కొంచెం ఎక్కువ సమానం అనిపిస్తారు.

Anonymous said...

chaala baagaa raasaaru

Anonymous said...

no one should feel pity of one's own job or other jobs......if he is not happy with the job he should change his profession.....

there is no need to be fear about wat if no one will be available for a particular job. As long as there is need/demand for the work/outcome( say food grains)....there will be ppl who will take up those jobs......

so lets not be too emotional......actually being emotionally attached to a job even if u r not enjoying is very dangerous.........

మంచు said...

హ హ హ థాంక్స్ అనానిమస్ గారు. ఇంఫర్మేషన్ చేరవేసిందందుకు. వాళ్ళకు నా రెప్లై

..|..


:-) మంచు

మంచు said...

కృష్ణప్రియగారు: మీ అభ్రిప్రాయానికి థాంక్స్. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నిచండి. :-)

మొదటి అనానిమస్ గారు: థాంక్స్ అండీ...

రెండొవ అనానిమస్ గారు: కళ్ళు తెరిపించే విషయాలు చెప్పారు. ధన్యవాదాలు

satish said...

manchu ... neeku vachina doubt e naku vachindi.. nenu oka sari aithe ma nanna garni adiganu kuda.. polam meda kanna.. interest e ekkuva vasthundi kada ani.. appudu ma nanna garu oka chirunavvu navvi vadilesaru :) .. naku e madyana a navvuku ardam ento telsindi :) .. kondariki sampadinchamu annadanikanna.. entha kastapadi sraminchi sampadaninchamu annadi important ani :)

మంచు said...

సతీష్ గారు... మీ అభిప్రాయానికి ధన్యవాదాలు..... ఆ నవ్వు నాకు బాగా పరిచయం... ఇప్పుడు నేను ఆ నవ్వు నవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నాలెండి... :-)

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Wonderful post. Thank god, I did not miss it.
W/R-Saikiran

krishna said...

very nice post.meru na manasulo mata laga rasaru.my father is a farmer .farmer kastalu nenu chinnappdu nuchi chustunee unaa...

kaneesam maa parents kastam kuli kuda migaladam ledu. ayna vallu vyasayam manadam ledu. enduku ante adi valla ki telisina oke oka vidya. nenu velli cheddam ante emi cheyyaleni paristithi.

శేఖర్ (Sekhar) said...

Touching

Thanks for posting this

Rajesh Devabhaktuni said...

దేశానికి పట్టెడన్నం పెడుతున్న రైతుకి ఈ రోజున మిగులుతున్నది ఏమి లేదు, ప్రభుత్వం ఎలాగు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లేదు. రైతనేవాడు ఎంతో ఆత్మా గౌరవం కలిగినవాడు, వారు సంవత్సరమంతా కష్టపడి సంపాదించింది ఏదో కొంత లాభానికి అమ్మగా తనకు కొంత మిగుల్చుకుంటాడు. మీరు చెప్పినట్లు ముమ్మాటికి దేశసేవ చేస్తున్న వాడు. అందుకే స్వదేస్ సినిమాలో షారుఖ్, పొలం కవులు డబ్బులు తెవడానికి ఒక రైతు దగ్గరకు వెళ్ళినప్పుడు జరిగే సంఘటన వారి మీద నాకు మరింత గౌరవాన్ని పెంచింది. అది నేను బ్రతికున్నంత కాలం రైతనేవాడు ఉన్నా లేకపోయినా నేను మర్చిపోలేను. వారిని తప్పనిసరిగా గౌరవించాలి, అది వారు చేసే సేవకు కష్టానికి మనకు కనీసం ఉండాల్సిన / మనం ఇవ్వాల్సిన గౌరవం.

ఇంతాచేసి / చూసి మనిషనేవాడు కోరుకునేది వాడు భాదలలో ఉన్నప్పుడు ఒక పలకరింపు, ఒకరి స్పర్శ, వాళ్ళ భాదలు తీర్చినా తీర్చక పోయినా వినడానికి ఒక మనిషి. ( భాదలు తీర్చగలిగే వాళ్ళు ఉంటె సరేసరి, అందుకే దేవుడు అనేవాడు ఉన్నాడు అని కొందరు నమ్ముతారు ). ఎంతో డబ్బు అప్పలంగా దోచుకున్నా కుడా, రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు పాలించిన నాయకుడికంటే చిన్నవాడైనా కుడా ఆ యువ నాయకుడు అర్ధం చేసుకుంది, గ్రహించింది ఆ కిటుకే, అందుకే ఆ బాబు కంటే ఈ యువ బాబుకే జనాలు ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు, నేను ఈ యువ బాబును సమర్ధించడం లేదు, తొమ్మిది సంవత్సరాలు పోడిచానని చెప్పుకునే బాబు రాజధాని వదిలి బయటకు రారు, కాని పదవి కావాలి. వ్యవసాయం అంటే పట్టదు, సిగ్గుచేటు, పెద్దాయన ఉంటె చెప్పు తీసుకుని తన్నినంత పని చేసేవాడు.

ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాల్లో తెలియదు కాని మన రాష్ట్రంలో మాత్రం రైతు పరిస్థితి చాల దయనీయంగా ఉంది. దేశానికి పట్టెడన్నం పెట్టె రైతు ఆత్మహత్యలు జరగడం / చేసుకోవడం , దానికి పలు విదాలుగా కారణమైన రాజకీయ, సామాజిక, వాతావరణాలలో మార్పులు జరిగిన ఈ దేశంలోనే పాపం పోగవుతుంది. ఆ పాపానికి ప్రతీకగానే ప్రకృతి రూపంలో భూకంపాలు, సునామీలు మన దేశంలో కుడా దాపురిస్తున్నాయి. మన దేశం గడచిన రెండుమూడు దశాబ్దాలుగా ఏ మాత్రం పుణ్యభూమి కాదు, పాపం వర్దిల్లుతున్న, పాపం చేసేవారు కదం తోక్కుతున్న భూమి. అందుకే ఈ దుస్థితి. ఏమి చేయలేని, ఓటు వేయడానికి తప్ప ఎందుకు పనికిరాని జనాభాగా మనందరం రైతు హత్యలను, మరిన్ని చెడు సంఘటనలను వేడుక చూస్తున్నాము. అంతే. ప్రస్తుతానికి పాపే చిరాయువుగా మారిన దేశం మన గొప్ప భారతదేశం.

సంతు (santu) said...

జై కిసాన్, జై జవాన్
మీరు అన్నట్టుగా ఆ రెండు వృత్తులు చేయాలంటే ఎంతో మనో ధైర్యం కావాల్సిందే,
మీ పోస్ట్ చదివిన తర్వాతే నాకు ఈ రెండింటి పైన, ఏదో కొత్త అవగాహన వోచ్చినట్టుగా అనిపిస్తోంది...
నేను నా పదో తరగతిలో మా అమ్మతో నేను ఆర్మీ లో జాయిన్ అవ్తానని అడిగా.. ప్చ్... తిట్టి,కొట్టి ఈ చదువుల వలయంలో పడేసారు...